Adipurush
కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్ కొత్త చిత్రం ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావడం లేదని తాజా సమాచారం. కొన్ని రోజులుగా ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్న చిత్ర బృందం.. చివరికి సంక్రాంతి రేసు నుంచి తమ చిత్రాన్ని తప్పించడానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లందరికీ విషయం చేరవేశారట.
ఈ మేరకు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జోరుగా వార్తలొస్తున్నాయి. నెల ముందు వరకు ఆదిపురుష్ సినిమా విషయంలో చాలా ధీమాగా ఉంది చిత్ర బృందం. కానీ టీజర్ రిలీజయ్యాక పరిస్థితి మారిపోయింది. అది నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అందులో విజువల్ ఎఫెక్ట్స్తో పాటు రావణుడు, హనుమంతుడు పాత్రల లుక్స్, అప్పీయరెన్స్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీంతో ఓం రౌత్ అండ్ టీం వీఎఫెక్స్, ఇతర విషయాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. మరోవైపు సంక్రాంతికి తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి మాస్ మసాలా సినిమాలు విడుదల ఖరారు చేసుకున్నాయి. వాటికి తోడు విజయ్ డబ్బింగ్ మూవీ వారసుడు కూడా విడుదలవుతోంది.
వాటి కోసం చాలా థియేటర్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆదిపురుష్ లాంటి భారీ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో సోలోగా రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పోటీ లేకుంటేనే దీనికి మంచిది. సంక్రాంతికి తక్కువ థియేటర్లలో, ఇంత పోటీ మధ్య రిలీజ్ చేస్తే వసూళ్లపై తీవ్ర ప్రభావం తప్పదు.
ఈ నేపథ్యంలో సినిమాను కొంచెం లేటుగా సోలోగా రిలీజ్ చేయడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారని, ఈ లోపు సినిమాకు మెరుగులు దిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆదిపురుష్ వాయిదాపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…