అల్లు శిరీష్ హీరోగా కెరీర్ మొదలు పెట్టి చాలా ఏళ్లవుతుంది. అప్పుడెప్పుడో ‘గౌరవం’ సినిమాతో హీరోగా వచ్చిన శిరీష్ ఇప్పటికీ ఓ సాలిడ్ హిట్ అందుకోలేకపోతున్నాడు. ఆ మధ్య ‘శ్రీరస్తు శుభమస్తు’ తో ఓ హిట్ అందుకున్నాడు మళ్ళీ ఆ తర్వాత చేసినవన్నీ శిరీష్ నిరాశే మిగిల్చాయి. ‘ఒక్క క్షణం’ అనే డిఫరెంట్ స్టోరీతో ఎక్సపెరిమెంట్ చేసినా ఆ సినిమా కూడా హిట్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘ABCD’కూడా ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసి శిరీష్ కి మరో ఫ్లాప్ మిగిల్చింది. దీంతో కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న శిరీష్ మళ్ళీ ‘ఊర్వసివో రాక్షసివో’ అనే యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
శిరీష్ హీరోగా అను ఇమ్మానుయల్ జంటగా రాకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. శిరీష్ ఇప్పటికే ఇంటర్వ్యూ లు , టూర్లతో చేయాల్సిన అన్ని ప్రమోషన్స్ చేసేశాడు. రేపు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి బాలయ్య కూడా రంగంలో దిగబోతున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి అల్లు అరవింద్ ,శిరీష్ గురించి మాట్లాడి సినిమాను సపోర్ట్ చేయనున్నాడు. ఇదే ఈవెంట్ లో బాలయ్య సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నాడు. ట్రైలర్ తో సినిమాపై మరికొన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
ఏదేమైనా శిరీష్ కి ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా ముఖ్యం. హీరోగా మరింత బిజీ అవ్వాలన్న మరో నిర్మాత తనను నమ్మి సినిమా తీసేందుకు ముందుకు రావాలన్న ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇక ఈ శుక్రవారం శిరీష్ సినిమాకు పోటీగా మరికొన్ని చిన్న సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. వాటిలో శిరీష్ సినిమా మీదే కొంత బజ్ ఉంది కాబట్టి టాక్ బాగుంటే శిరీష్ హిట్ కొట్టే అవకాశం కనిపిస్తుంది. చూడాలి అల్లు వారబ్బాయి ఈ ఛాలెంజ్ ఎలా ఫేస్ చేస్తాడో ?
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…