పోయినేడాది సరిగ్గా ఇదే రోజు కర్ణాటక ప్రజల్ని పెను విషాదంలో ముంచెత్తుతూ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు పునీత్ రాజ్కుమార్. కన్నడిగులు దేవుడిలా కొలిచే దిగ్గజ నటుడు రాజ్ కుమార్ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ నటుడిగానే కాక వ్యక్తిగా గొప్ప పేరు సంపాదించిన పునీత్.. అంత చిన్న వయసులో కాలం చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.
అతనెంత గొప్ప మానవతావాది, పబ్లిసిటీకి దూరంగా ఏ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడన్నది తన మరణం తర్వాతే చాలామందికి తెలిసింది. తన గొప్ప వ్యక్తిత్వం, సేవాభావం గురించి తెలుసుకుని ఇతర భాషల వాళ్లు కూడా కదిలిపోయారు. అతడి అంత్యక్రియల సమయంలో ఆ తర్వాత పునీత్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జేమ్స’ విడుదలైనపుడు కన్నడిగుల స్పందన చూసి అందరూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు మరోసారి అందరినీ పునీత్ కదిలించేస్తున్నాడు.
పునీత్ నటించిన అడ్వెంచరస్ డాక్యుమెంటరీ ‘గంధద గుడి’ తాజాగా థియేటర్లలో రిలీజైంది. అడవిలో సాగే అడ్వెంచరస్ జర్నీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అమోఘ వర్ష ఈ డాక్యు డ్రామాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కన్నడనాట పెద్ద ఎత్తునే రిలీజ్ చేశారు. వెండితెరపై పునీత్ చివరి దర్శనాన్ని చూసేందుకు కన్నడిగులు భారీగా తరలి వస్తున్నారు. ఇది జస్ట్ డాక్యుమెంటరీ అనుకున్న వాళ్లకు చిత్ర బృందం షాకిచ్చింది. ఇందులో సినిమాకు తక్కువ కాని డ్రామా ఉందట. థ్రిల్లంగ్ మూమెంట్స్ ఉన్నాయట. పునీత్కు ఒక రకంగా ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఇదొక డాక్యుమెంటరీ కావడంతో పునీత్ రియల్ క్యారెక్టర్ను తెరపై చూస్తున్న భావన కలిగి ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
బెంగళూరులోని ఒక మల్టీప్లెక్స్లో వేసిన ప్రిమియర్ షోకు హాజరైన పునీత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సెలబ్రెటీలతో పాటు అభిమానుల్లో ప్రతి ఒక్కరూ ఈ షో చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మిగతా థియేటర్లలోనూ ఇదే భావోద్వేగం కనిపిస్తోంది. హైదరాబాద్లో సైతం ‘గంధద గుడి’ షోలు నడుస్తున్నాయి.
This post was last modified on October 29, 2022 2:34 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…