ఈ ఏడాదే కాదు.. గత కొన్నేళ్లలో వచ్చిన సెన్సేషనల్ హిట్లలో ‘బింబిసార’ ఒకటి. ఫ్లాపులతో సతమతం అవుతున్నా కళ్యాణ్ రామ్ను హీరోగా పెట్టి భారీ బడ్జెట్లో, చారిత్రక నేపథ్యంతో ఒక కొత్త దర్శకుడు సినిమా తీయడం చూసి చాలామంది షాకయ్యారు. ఇది ఏమాత్రం వర్కవుట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసలు రాజుగా కళ్యాణ్ రామ్ ఏం సెట్టవుతాడని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ‘బింబిసార’ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
దుర్మార్గుడైన రాజు పాత్రలో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. పెట్టించిన ఖర్చు మీద ఆదాయాన్ని తెచ్చి పెట్టే స్థాయిలో సినిమాను పెద్ద హిట్ చేశాడు కొత్త దర్శకుడు వశిష్ఠ్. విడుదలకు ముందు బింబిసారను మూడు భాగాలుగా తీసే అవకాశం ఉందని కళ్యాణ్ రామ్ అంటే నవ్వుకున్న వాళ్లు.. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
బింబిసార-2 కోసం ఆల్రెడీ సన్నాహాలు మొదలైన మాట వాస్తవమే కానీ.. ఈ సినిమా తెరకెక్కడానికి, విడుదల కావడానికి చాలా టైం పట్టేలాగే కనిపిస్తోంది. ఈ దిశగా దర్శకుడు వశిష్ఠ్ సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే ఈ సినిమా మొదలుపెట్టే అవకాశాలు లేవని అతను స్పష్టం చేశాడు. కళ్యాణ్ రామ్కు ప్రస్తుతం కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయని, అవన్నీ పూర్తి చేశాకే ఈ సినిమా మొదలవుతుందని అతను స్పష్టం చేశాడు. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అందుకోవడానికి తన టీం చాలా కష్టపడాల్సి ఉందని వశిష్ఠ్ తెలిపాడు.
“బింబిసార సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతం వాళ్లందరూ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను వాళ్లందరికీ కొత్తదనాన్ని ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ల అంచనాలకు తగ్గట్లు సినిమాను రూపొందించాలనుకుంటున్నాం. మొదటి భాగాన్ని మించి రెండో పార్ట్ను తీయాలనే ఒత్తిడి నాప ఉంది. కళ్యాణ్ రామ్ తన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార-2 షూటింగ్ మొదలవుతుంది” అని వశిష్ఠ్ చెప్పాడు.
This post was last modified on October 28, 2022 9:24 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…