దర్శకుడు పూరి జగన్నాధ్ ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్సియర్ల మీద పోలీస్ కేసు దాకా వెళ్లడంతో వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయింది. విషయాన్నీ ఇంతదాకా తీసుకొచ్చినందుకు ఇకపై అతని సినిమాలు కొనకుండా బ్యాన్ చేయాలని పంపిణీదారులు నిర్ణయం తీసుకున్నట్టుగా వచ్చిన వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. లైగర్ డిజాస్టర్ తాలూకు నష్టాలను భర్తీ చేసే ఇష్యూలో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వాదోపవాదాలు ఇప్పుడు పీక్స్ కు చేరుకున్నాయి. ముంబైలో ఉన్న పూరి హైదరాబాద్ వచ్చే సూచనలు దగ్గరలో లేవు కానీ ఇక్కడి పరిణామాలు మాత్రం చాలా హాట్ గా మారిపోతున్నాయి. అందులో వచ్చిందే ఈ బ్యాన్ రచ్చ.
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ నిషేధం చేయమనేది అంత సులభం కాదు. ఎందుకంటే కోట్ల రూపాయల వ్యాపారంతో ముడిపడిన సినిమాలో కేవలం ఒక్కరి పాత్రే ఉండదు. ఉదాహరణకు గాడ్ ఫాదర్ ప్రమోషన్ లో చెప్పినట్టు ఒకవేళ చిరంజీవి పూరికి ఓ ఛాన్స్ ఇచ్చారనుకుందాం. అదయ్యాక దర్శకుడి ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా క్రేజ్ వచ్చేస్తుంది. అప్పుడు బయ్యర్లు ఇది పూరి తీసింది కాబట్టి మేము మెగాస్టార్ మూవీ కొనమని భీష్మించుకుని ఉండగలరా. ప్రొడక్షన్ వేరేవాళ్లది అయినప్పుడు అలా అనే అవకాశం ఉండదు. మేము కొనమని తెగేసి చెబితే అది పూరికి ఒకటే కాదు ఆయన చేసిన సదరు హీరోకూ వర్తిస్తుంది.
మలయాళంలో అన్ని సినిమాలు ఓటిటిలకే ఇస్తున్నాడని ఫహద్ ఫాసిల్ మీద ఇలాంటి బ్యానే చేసిన అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తర్వాత తూచ్ అనేశారు. ముందు మంకుపట్టు పట్టిన మల్టీప్లెక్సులు తర్వాత తమ నిర్ణయం మార్చుకున్నాయి. ఇప్పుడే కాదు పాతికేళ్ల క్రితం ప్రకాష్ రాజ్ ని వెలేసినప్పుడు వాతావరణం సీరియస్ గా ఉండేది. కానీ ఆ తర్వాత ఆయనే టాప్ మోస్ట్ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. ఇప్పుడీ లైగర్ పంచాయితీ కూడా ఏదో రోజు చల్లారిపోతుంది. కాకపోతే పూరికి బయట హీరోలు ఓకే చెప్పడం సులభంగా ఉండదు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్తవాళ్లతో చేయడమో లేదా కొడుకు ఆకాష్ తో ఒక మంచి స్క్రిప్ట్ ని రెడీ చేసుకోవడమో ఉత్తమం.
This post was last modified on October 28, 2022 7:18 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…