ఒక చిన్న సినిమాను బిజినెస్ వ్యవహారాలు చక్కదిద్ది థియేటర్ల దాకా తీసుకురావడం నిర్మాతకు ఎంత పెద్ద విషమ పరీక్షో చెప్పనక్కర్లేదు. పోనీ నానా కష్టాలు పడి రిలీజ్ చేసినా ఎలాంటి హైప్ లేకపోతే జనం వచ్చే సీన్ లేదు. విడుదల రోజు మొదటి ఆటకు కనీసం సిబ్బంది రోజువారీ జీతంలో పది శాతం వసూలు చేయలేనంత దారుణంగా పరిస్థితులు తలెత్తుతున్నాయి. స్టార్ క్యాస్టింగ్ లేదా కంటెంట్ పవర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి బలంగా ఉంటే తప్ప గట్టెక్కడం అసాధ్యమనేలా ఉంది. అలా అని మీకు ఇస్తాం కొనేసుకోండి అంటే ఓటిటిలు గుడ్డిగా తలూపడం లేదు. కొత్త కొత్త కండీషన్లు పెట్టి నరకం చూపిస్తున్నాయి.
ఇవన్నీ ఎలాగోలా దాటుకుని ఆహాలో నేరుగా వచ్చిన చిత్రం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. అలీకి ఏపీ ప్రభుత్వం పదవిని ప్రకటించిన మరుసటి రోజే ఇది రావడం విశేషం. మళయాలంలో సక్సెస్ అయిన వికృతికి ఇది సీన్ టు సీన్ రీమేక్. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఆగి ఆగి ఫైనల్ గా డిజిటల్ డీల్ సెట్ చేసుకుని ప్రేక్షకుల ఇళ్లలోకి వచ్చేసింది. మెట్రో ట్రైన్ లో మాటలు రాని శ్రీనివాసరావు(నరేష్) అపస్మారక స్థితిలో పడి ఉంటే దాన్ని ఫోటో తీసిన సమీర్(అలీ)అది వైరల్ అవ్వడానికి కారణమవుతాడు. దీంతో ఆ రావుకి బయట అవమానాలు ఎదురవుతాయి. వ్యవహారం సీరియస్ గా మారుతుంది. ఆపై జరిగేది అసలు స్టోరీ.
ఒరిజినల్ సంగతి ఎలా ఉన్నా అసలు ఆలీకి ఈ వయసులో పాటలు, రొమాన్స్ ట్రాక్ పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఆలోచన దర్శకుడు కిరణ్ శ్రీపురంకు రాకపోవడం విచిత్రం. ఆర్టిస్టులు తమ పరిధి మేరకు బాగానే నటించినప్పటికీ అవసరం లేని సీన్లు, సాగదీసిన స్క్రీన్ ప్లేతో టైటిల్ లో ఉన్న బాగున్నతనం సినిమాలో లేకుండా పోయింది. నరేష్ పవిత్ర జంటగా కనిపించడం ఒకటే జనాలకు కొంత స్పెషల్ గా అనిపిస్తుంది తప్ప రెండున్నర గంటలకు సరిపడా మ్యాటర్ లేక చూసేవాళ్లకు విసుగు తప్పలేదు. థియేటర్ ని తప్పించుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అంతే సంగతులయ్యేవి.
This post was last modified on October 28, 2022 3:34 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…