ఒక చిన్న సినిమాను బిజినెస్ వ్యవహారాలు చక్కదిద్ది థియేటర్ల దాకా తీసుకురావడం నిర్మాతకు ఎంత పెద్ద విషమ పరీక్షో చెప్పనక్కర్లేదు. పోనీ నానా కష్టాలు పడి రిలీజ్ చేసినా ఎలాంటి హైప్ లేకపోతే జనం వచ్చే సీన్ లేదు. విడుదల రోజు మొదటి ఆటకు కనీసం సిబ్బంది రోజువారీ జీతంలో పది శాతం వసూలు చేయలేనంత దారుణంగా పరిస్థితులు తలెత్తుతున్నాయి. స్టార్ క్యాస్టింగ్ లేదా కంటెంట్ పవర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి బలంగా ఉంటే తప్ప గట్టెక్కడం అసాధ్యమనేలా ఉంది. అలా అని మీకు ఇస్తాం కొనేసుకోండి అంటే ఓటిటిలు గుడ్డిగా తలూపడం లేదు. కొత్త కొత్త కండీషన్లు పెట్టి నరకం చూపిస్తున్నాయి.
ఇవన్నీ ఎలాగోలా దాటుకుని ఆహాలో నేరుగా వచ్చిన చిత్రం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. అలీకి ఏపీ ప్రభుత్వం పదవిని ప్రకటించిన మరుసటి రోజే ఇది రావడం విశేషం. మళయాలంలో సక్సెస్ అయిన వికృతికి ఇది సీన్ టు సీన్ రీమేక్. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఆగి ఆగి ఫైనల్ గా డిజిటల్ డీల్ సెట్ చేసుకుని ప్రేక్షకుల ఇళ్లలోకి వచ్చేసింది. మెట్రో ట్రైన్ లో మాటలు రాని శ్రీనివాసరావు(నరేష్) అపస్మారక స్థితిలో పడి ఉంటే దాన్ని ఫోటో తీసిన సమీర్(అలీ)అది వైరల్ అవ్వడానికి కారణమవుతాడు. దీంతో ఆ రావుకి బయట అవమానాలు ఎదురవుతాయి. వ్యవహారం సీరియస్ గా మారుతుంది. ఆపై జరిగేది అసలు స్టోరీ.
ఒరిజినల్ సంగతి ఎలా ఉన్నా అసలు ఆలీకి ఈ వయసులో పాటలు, రొమాన్స్ ట్రాక్ పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఆలోచన దర్శకుడు కిరణ్ శ్రీపురంకు రాకపోవడం విచిత్రం. ఆర్టిస్టులు తమ పరిధి మేరకు బాగానే నటించినప్పటికీ అవసరం లేని సీన్లు, సాగదీసిన స్క్రీన్ ప్లేతో టైటిల్ లో ఉన్న బాగున్నతనం సినిమాలో లేకుండా పోయింది. నరేష్ పవిత్ర జంటగా కనిపించడం ఒకటే జనాలకు కొంత స్పెషల్ గా అనిపిస్తుంది తప్ప రెండున్నర గంటలకు సరిపడా మ్యాటర్ లేక చూసేవాళ్లకు విసుగు తప్పలేదు. థియేటర్ ని తప్పించుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అంతే సంగతులయ్యేవి.
This post was last modified on October 28, 2022 3:34 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…