తెలుగు ఓటిటి యాప్ లో బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్ని సినిమాలు కాని సిరీస్ లు కాని ఏంటి అని ఎవరినైనా అడిగితే.. ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది డబ్బింగ్ సినిమాలే. చాలామంచి తమిళ, మలయాళం సినిమాలను మనోళ్లు డబ్బింగ్ చేసి తెలుగులో సదరు ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే కాంతారా సినిమా తరువాత హీరో రిషబ్ షెట్టికి బాగా క్లోజ్ అయిన అల్లు అరవింద్ ఇప్పుడు ఆహా కోసం కాంతారాతో కలిపి ఒక మంచి డీల్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
ఆల్రెడీ కాంతారా సినిమాను ఒక పెద్ద ఓటిటికి ఇచ్చేసినా కూడా.. హొంబాలే ఫిలింస్ సంస్థ ఇప్పుడు మరో డీల్ కోసం యత్నిస్తోందని టాక్. ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్.. కాంతారా తెలుగు వర్షన్ ను ‘ఆహా’కు కూడా ఇచ్చేలా సెట్ చేస్తున్నారట. అంతేకాకుండా.. ఈ సినిమా సక్సెస్ తో రిషబ్ షెట్టికి బాగా ఫేం వచ్చేయడంతో.. ఆ హీరో నటించిన కన్నడ సినిమాలన్నింటినీ ఇప్పుడు డబ్బింగ్ చేసిన ఆహాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట.
ఆల్రెడీ రిషబ్ చేసిన బెల్ బాటమ్ సినిమా తెలుగులో బాగానే ఎక్కేసింది. అది కూడా ఆహాలోనే ఉంది. ఇప్పుడు ఆ సినిమాను చూస్తే.. అరే అందరూ కాంతారా సినిమాలో ఉన్న యాక్టర్లే ఉన్నారే అనుకుంటారు. అందుకే రిషబ్ ఇతర సినిమాల తాలూకు రైట్స్ కూడా వేర్వేరు ప్రొడ్యూసర్ల దగ్గర నుండి తీసుకునే పనిలోపడింది ఆహా యాప్. మొత్తానికి ఇలాంటి డీల్స్ సెట్ చెయ్యాలంటే అల్లు అరవింద్ తనకు తానే సాటిలే.
ఇకపోతే తెలుగు బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తున్న కాంతారా సినిమా.. తెలుగులో ఆల్రెడీ ₹30 కోట్ల్ గ్రాస్ వసూలు చేయగా.. బాలీవుడ్లో కూడా దాదాపు ₹30కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అనస్టాపబుల్ గా సాగుతున్న కాంతారా దాదాపు వరల్డ్ వైడ్ అన్ని బాషల్లోనూ కలిపి ₹200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సెలవిస్తున్నాయి.
This post was last modified on October 28, 2022 12:43 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…