తెలుగు ఓటిటి యాప్ లో బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్ని సినిమాలు కాని సిరీస్ లు కాని ఏంటి అని ఎవరినైనా అడిగితే.. ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది డబ్బింగ్ సినిమాలే. చాలామంచి తమిళ, మలయాళం సినిమాలను మనోళ్లు డబ్బింగ్ చేసి తెలుగులో సదరు ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే కాంతారా సినిమా తరువాత హీరో రిషబ్ షెట్టికి బాగా క్లోజ్ అయిన అల్లు అరవింద్ ఇప్పుడు ఆహా కోసం కాంతారాతో కలిపి ఒక మంచి డీల్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
ఆల్రెడీ కాంతారా సినిమాను ఒక పెద్ద ఓటిటికి ఇచ్చేసినా కూడా.. హొంబాలే ఫిలింస్ సంస్థ ఇప్పుడు మరో డీల్ కోసం యత్నిస్తోందని టాక్. ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్.. కాంతారా తెలుగు వర్షన్ ను ‘ఆహా’కు కూడా ఇచ్చేలా సెట్ చేస్తున్నారట. అంతేకాకుండా.. ఈ సినిమా సక్సెస్ తో రిషబ్ షెట్టికి బాగా ఫేం వచ్చేయడంతో.. ఆ హీరో నటించిన కన్నడ సినిమాలన్నింటినీ ఇప్పుడు డబ్బింగ్ చేసిన ఆహాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట.
ఆల్రెడీ రిషబ్ చేసిన బెల్ బాటమ్ సినిమా తెలుగులో బాగానే ఎక్కేసింది. అది కూడా ఆహాలోనే ఉంది. ఇప్పుడు ఆ సినిమాను చూస్తే.. అరే అందరూ కాంతారా సినిమాలో ఉన్న యాక్టర్లే ఉన్నారే అనుకుంటారు. అందుకే రిషబ్ ఇతర సినిమాల తాలూకు రైట్స్ కూడా వేర్వేరు ప్రొడ్యూసర్ల దగ్గర నుండి తీసుకునే పనిలోపడింది ఆహా యాప్. మొత్తానికి ఇలాంటి డీల్స్ సెట్ చెయ్యాలంటే అల్లు అరవింద్ తనకు తానే సాటిలే.
ఇకపోతే తెలుగు బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తున్న కాంతారా సినిమా.. తెలుగులో ఆల్రెడీ ₹30 కోట్ల్ గ్రాస్ వసూలు చేయగా.. బాలీవుడ్లో కూడా దాదాపు ₹30కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అనస్టాపబుల్ గా సాగుతున్న కాంతారా దాదాపు వరల్డ్ వైడ్ అన్ని బాషల్లోనూ కలిపి ₹200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సెలవిస్తున్నాయి.
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి…
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…