తెలుగు ఓటిటి యాప్ లో బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్ని సినిమాలు కాని సిరీస్ లు కాని ఏంటి అని ఎవరినైనా అడిగితే.. ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది డబ్బింగ్ సినిమాలే. చాలామంచి తమిళ, మలయాళం సినిమాలను మనోళ్లు డబ్బింగ్ చేసి తెలుగులో సదరు ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే కాంతారా సినిమా తరువాత హీరో రిషబ్ షెట్టికి బాగా క్లోజ్ అయిన అల్లు అరవింద్ ఇప్పుడు ఆహా కోసం కాంతారాతో కలిపి ఒక మంచి డీల్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
ఆల్రెడీ కాంతారా సినిమాను ఒక పెద్ద ఓటిటికి ఇచ్చేసినా కూడా.. హొంబాలే ఫిలింస్ సంస్థ ఇప్పుడు మరో డీల్ కోసం యత్నిస్తోందని టాక్. ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్.. కాంతారా తెలుగు వర్షన్ ను ‘ఆహా’కు కూడా ఇచ్చేలా సెట్ చేస్తున్నారట. అంతేకాకుండా.. ఈ సినిమా సక్సెస్ తో రిషబ్ షెట్టికి బాగా ఫేం వచ్చేయడంతో.. ఆ హీరో నటించిన కన్నడ సినిమాలన్నింటినీ ఇప్పుడు డబ్బింగ్ చేసిన ఆహాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట.
ఆల్రెడీ రిషబ్ చేసిన బెల్ బాటమ్ సినిమా తెలుగులో బాగానే ఎక్కేసింది. అది కూడా ఆహాలోనే ఉంది. ఇప్పుడు ఆ సినిమాను చూస్తే.. అరే అందరూ కాంతారా సినిమాలో ఉన్న యాక్టర్లే ఉన్నారే అనుకుంటారు. అందుకే రిషబ్ ఇతర సినిమాల తాలూకు రైట్స్ కూడా వేర్వేరు ప్రొడ్యూసర్ల దగ్గర నుండి తీసుకునే పనిలోపడింది ఆహా యాప్. మొత్తానికి ఇలాంటి డీల్స్ సెట్ చెయ్యాలంటే అల్లు అరవింద్ తనకు తానే సాటిలే.
ఇకపోతే తెలుగు బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తున్న కాంతారా సినిమా.. తెలుగులో ఆల్రెడీ ₹30 కోట్ల్ గ్రాస్ వసూలు చేయగా.. బాలీవుడ్లో కూడా దాదాపు ₹30కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అనస్టాపబుల్ గా సాగుతున్న కాంతారా దాదాపు వరల్డ్ వైడ్ అన్ని బాషల్లోనూ కలిపి ₹200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సెలవిస్తున్నాయి.
This post was last modified on October 28, 2022 12:43 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…