Adipurush
టీజర్ వచ్చినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ కన్నా కామెంట్స్ ఎక్కువగా అందుకున్న ఆది పురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు ఓం రౌత్, నిర్మాణ సంస్థ టి సిరీస్ తమ చుట్టూ పరిస్థితులు ఎంత పోటీ వాతావరణాన్ని సృష్టిస్తున్నా సరే సంక్రాంతి విడుదల విషయంలో మాత్రం వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నారట. నార్త్ లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎటొచ్చి తెలుగు తమిళంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయ్, అజిత్ లాంటి హీరోలను తట్టుకుని ఎక్కువ థియేటర్లను వేసుకోవడం అంత సులభం కాదు. పైగా వీటి నిర్మాతలందరూ పెద్ద హస్తాలే.
స్టార్ క్యాస్టింగ్ కన్నా ఎక్కువగా ప్రభాస్ ఇమేజ్, విజువల్ ఎఫెక్ట్స్ నే ఎక్కువ నమ్ముకున్న ఆది పురుష్ నిడివిని 3 గంటల 15 నిమిషాలకు లాక్ చేశారనే లీక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరీ ఇంత లెన్త్ అంటే కష్టమేమోననే అభిప్రాయం వ్యక్తమవుతోందట. అంటే ఇంటర్వెల్ ఇంకో పావు గంట, హైదరాబాద్ లాంటి నగరాల్లో రానుపోను ప్రయాణం ఒక గంట కలుపుకుని అంత సమయం ప్రేక్షకులు వెచ్చించాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో ఉండాలి. ఆర్ఆర్ఆర్ దీనికి పది నిమిషాలే తక్కువున్నా ఆడియన్స్ బోర్ ఫీలవ్వలేదు. సో మెప్పిస్తే జనం ఒప్పుకునే ఛాన్స్ ఉంది.
ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సినిమా ఎలా ఉంటుందోననే టెన్షన్ తో సతమతమవుతున్నారు. సాహో, రాధే శ్యామ్ రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ. అసలే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. అవుట్ ఫుట్ ఏ మాత్రం అటుఇటు అయినా ఈసారి ట్రోలింగ్ భీభత్సంగా ఉంటుంది. అడిగిన ప్రతిసారి ఓం రౌత్ గట్టి భరోసానే ఇస్తున్నాడు. ట్రైలర్ కట్ అయినా పర్ఫెక్ట్ గా ఉంటే అంచనాలను ఎగబాకేలా చేయొచ్చు. ప్రస్తుతానికైతే టీజర్ కొచ్చిన విమర్శలను సీరియస్ గా తీసుకున్న ఆది పురుష్ టీమ్ వాటి మీద బలంగా వర్క్ చేస్తోంది. వర్కౌట్ అయితే మంచిదేగా
This post was last modified on October 27, 2022 8:10 pm
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…