ఒక మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా కామెడీకి తిరుగులేని రారాజుగా కొనసాగాడు బ్రహ్మానందం. ఆయన స్టార్ కమెడియన్ అయ్యాక చాలామంది కమెడియన్లు వచ్చారు వెళ్లారు. బాబూ మోహన్, ఎమ్మెస్ నారాయణ, సునీల్, వేణుమాధవ్ లాంటి కమెడియన్లు బ్రహ్మానందంకు గట్టి పోటీనిచ్చారు. కానీ బ్రహ్మానందం స్థానం మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరలేదు. కెరీర్లో అప్పుడప్పుడూ కొంచెం డౌన్ అయినట్లు కనిపించినా.. మళ్లీ బలంగా పుంజుకుని తన హవాను చూపించాడు బ్రహ్మి.
ఇక సోషల్ మీడియా ఊపు మొదలయ్యాక బ్రహ్మి పాపులారిటీ ఇంకా పెరిగింది. కెరీర్ పీక్స్ను అందుకున్నాడాయన. కానీ కొన్నేళ్ల కిందట్నుంచి ఈ నవ్వుల రారాజుకు పెద్దగా కలిసి రావట్లేదు. ఉన్నట్లుండి సినిమాలు తగ్గిపోయాయి. చూస్తుండగానే ఫేడవుట్ అయిపోయాడు బ్రహ్మి. ఇక మళ్లీ బ్రహ్మిని సినిమాల్లో చూడలేమా అనే పరిస్థితి వచ్చింది.
ఐతే ఇటీవల మళ్లీ బ్రహ్మి కొంచెం పుంజుకుంటున్నాడు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇంతకుముందులా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు పడకపోయినా.. మళ్లీ కొంచెం బిజీ అయితే అవుతున్నారు. ఇటీవలే అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో తనదైన శైలిలో ప్రసంగించి నవ్వించిన బ్రహ్మి.. తాజాగా కృష్ణవంశీ సినిమా ‘రంగమార్తాండ’ డబ్బింగ్ పని మొదులపెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
మామూలుగా నిలబడి డబ్బింగ్ చెబుతుంటారు కానీ.. బ్రహ్మి మాత్రం చక్కగా సింహాసనం లాంటి కుర్చీలో కాళ్లు మడిచి కూర్చుని భలేగా ఫన్నీగా కనిపిస్తున్నాడు. ఇది చూసి డబ్బింగ్ ఇలా కూడా చెప్పొచ్చా.. బ్రహ్మి స్టైలే వేరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘రంగమార్తాండ’లో బ్రహ్మి కొంచెం సీరియస్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on October 27, 2022 3:22 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…