టాలీవుడ్లో అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘శక్తి’ కచ్చితంగా ఉంటుంది. అదే సమయంలో టాలీవుడ్లో అతి పెద్ద డిాజాస్టర్లలో కూడా దాన్నొకటిగా చెప్పొచ్చు. సినిమా రిలీజై దశాబ్దం దాటినా ఇప్పటికీ ‘శక్తి’ తాలూకు చేదు జ్ఞాపకాలను తారక్ అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఇక ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో లెక్కే లేదు.
ఈ సినిమా రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా తారక్ అభిమానులు సైలెంటుగా ఉంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ పతనం ఈ సినిమాతోనే మొదలైంది. దీని తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ అవడంతో చాలా ఏళ్ల పాటు అతను మరో సినిమాను దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడేదో మెగాస్టార్ చిరంజీవి దయచూపి అతడికి రీమేక్ మూవీ అయిన ‘భోళా శంకర్’ తీసే ఛాన్స్ ఇచ్చాడు.
ఐతే సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్న మెహర్.. అంతకంటే ముందు మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. తాజాగా అతను ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘శక్తి’ పరాజయం తాలూకు కారణాలు చెప్పాడు. నిజానికి తాను ‘శక్తి’ సినిమాను ‘మిషన్ ఇంపాజిబుల్’ స్టయిల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీయాలని అనుకున్నట్లు మెహర్ చెప్పాడు.
తాను అశ్వినీదత్, ఎన్టీఆర్లకు ముందు చెప్పిన కథ కూడా వేరని.. ఐతే దత్ తనకు యండమూరి వీరేంద్రనాథ్, గంధం నాగరాజు లాంటి ఉద్దండులైన రచయితల్ని ఇచ్చారని.. వారు వచ్చాక కథలోకి భక్తి కోణం వచ్చిందని.. అక్కడే సినిమా దెబ్బ తిందని మెహర్ తెలిపాడు. తాను కథను ఇలా మార్చడం బాగుండదని చెప్పినా, పాత కథే చేద్దామని చెప్పినా అశ్వినీదత్ వినలేదన్నట్లు మెహర్ మాట్లాడాడు. ఈ సినిమా విడులదకు వారం ముందే ఇది ఆడదని తనకు తెలిసిపోయిందని మెహర్ తెలిపాడు. ‘శక్తి’కి బడ్జెట్, బిజినెస్ పరంగా బాగానే వర్కవుటైందని.. కానీ థియేటర్లలోకి సినిమా వచ్చాక పరిస్థితి మారిపోందని అతనన్నాడు.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి అనుకున్నట్లే మల్టీస్టారర్ ను పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్ట్ ఉదయమే…
పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్రోలియం శాఖ కార్యదర్శి శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం మీద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మూడు…
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 2022లో థియేటర్లలోకి…
ఈ రోజుల్లో మిడ్ రేంజ్ స్టార్ల సినిమాలకు కూడా జనం థియేటర్లకు కష్టమైపోతోంది. ప్రోమోలు చాలా ఆకర్షణీయంగా ఉండి, మంచి…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇండియాలో ఎంత భారీ వసూళ్లు రాబడుతోందో చూస్తున్నాం, విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కథలో…