Movie News

‘శక్తి’ విషయంలో మెహర్ తప్పేం లేదట

టాలీవుడ్లో అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘శక్తి’ కచ్చితంగా ఉంటుంది. అదే సమయంలో టాలీవుడ్లో అతి పెద్ద డిాజాస్టర్లలో కూడా దాన్నొకటిగా చెప్పొచ్చు. సినిమా రిలీజై దశాబ్దం దాటినా ఇప్పటికీ ‘శక్తి’ తాలూకు చేదు జ్ఞాపకాలను తారక్ అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఇక ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో లెక్కే లేదు.

ఈ సినిమా రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా తారక్ అభిమానులు సైలెంటుగా ఉంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ పతనం ఈ సినిమాతోనే మొదలైంది. దీని తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ అవడంతో చాలా ఏళ్ల పాటు అతను మరో సినిమాను దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడేదో మెగాస్టార్ చిరంజీవి దయచూపి అతడికి రీమేక్ మూవీ అయిన ‘భోళా శంకర్’ తీసే ఛాన్స్ ఇచ్చాడు.

ఐతే సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్న మెహర్.. అంతకంటే ముందు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. తాజాగా అతను ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘శక్తి’ పరాజయం తాలూకు కారణాలు చెప్పాడు. నిజానికి తాను ‘శక్తి’ సినిమాను ‘మిషన్ ఇంపాజిబుల్’ స్టయిల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తీయాలని అనుకున్నట్లు మెహర్ చెప్పాడు.

తాను అశ్వినీదత్‌, ఎన్టీఆర్‌లకు ముందు చెప్పిన కథ కూడా వేరని.. ఐతే దత్ తనకు యండమూరి వీరేంద్రనాథ్, గంధం నాగరాజు లాంటి ఉద్దండులైన రచయితల్ని ఇచ్చారని.. వారు వచ్చాక కథలోకి భక్తి కోణం వచ్చిందని.. అక్కడే సినిమా దెబ్బ తిందని మెహర్ తెలిపాడు. తాను కథను ఇలా మార్చడం బాగుండదని చెప్పినా, పాత కథే చేద్దామని చెప్పినా అశ్వినీదత్ వినలేదన్నట్లు మెహర్ మాట్లాడాడు. ఈ సినిమా విడులదకు వారం ముందే ఇది ఆడదని తనకు తెలిసిపోయిందని మెహర్ తెలిపాడు. ‘శక్తి’కి బడ్జెట్, బిజినెస్ పరంగా బాగానే వర్కవుటైందని.. కానీ థియేటర్లలోకి సినిమా వచ్చాక పరిస్థితి మారిపోందని అతనన్నాడు.

This post was last modified on October 27, 2022 10:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago