టాలీవుడ్లో అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘శక్తి’ కచ్చితంగా ఉంటుంది. అదే సమయంలో టాలీవుడ్లో అతి పెద్ద డిాజాస్టర్లలో కూడా దాన్నొకటిగా చెప్పొచ్చు. సినిమా రిలీజై దశాబ్దం దాటినా ఇప్పటికీ ‘శక్తి’ తాలూకు చేదు జ్ఞాపకాలను తారక్ అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఇక ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో లెక్కే లేదు.
ఈ సినిమా రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా తారక్ అభిమానులు సైలెంటుగా ఉంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ పతనం ఈ సినిమాతోనే మొదలైంది. దీని తర్వాత ‘షాడో’ కూడా డిజాస్టర్ అవడంతో చాలా ఏళ్ల పాటు అతను మరో సినిమాను దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడేదో మెగాస్టార్ చిరంజీవి దయచూపి అతడికి రీమేక్ మూవీ అయిన ‘భోళా శంకర్’ తీసే ఛాన్స్ ఇచ్చాడు.
ఐతే సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్న మెహర్.. అంతకంటే ముందు మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. తాజాగా అతను ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘శక్తి’ పరాజయం తాలూకు కారణాలు చెప్పాడు. నిజానికి తాను ‘శక్తి’ సినిమాను ‘మిషన్ ఇంపాజిబుల్’ స్టయిల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీయాలని అనుకున్నట్లు మెహర్ చెప్పాడు.
తాను అశ్వినీదత్, ఎన్టీఆర్లకు ముందు చెప్పిన కథ కూడా వేరని.. ఐతే దత్ తనకు యండమూరి వీరేంద్రనాథ్, గంధం నాగరాజు లాంటి ఉద్దండులైన రచయితల్ని ఇచ్చారని.. వారు వచ్చాక కథలోకి భక్తి కోణం వచ్చిందని.. అక్కడే సినిమా దెబ్బ తిందని మెహర్ తెలిపాడు. తాను కథను ఇలా మార్చడం బాగుండదని చెప్పినా, పాత కథే చేద్దామని చెప్పినా అశ్వినీదత్ వినలేదన్నట్లు మెహర్ మాట్లాడాడు. ఈ సినిమా విడులదకు వారం ముందే ఇది ఆడదని తనకు తెలిసిపోయిందని మెహర్ తెలిపాడు. ‘శక్తి’కి బడ్జెట్, బిజినెస్ పరంగా బాగానే వర్కవుటైందని.. కానీ థియేటర్లలోకి సినిమా వచ్చాక పరిస్థితి మారిపోందని అతనన్నాడు.
This post was last modified on October 27, 2022 10:06 am
పైరసీలో ఎన్నో రకాలు చూశాం. కానీ ఒక సినిమా విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ ఆన్ లైన్లోకి…
మొన్న శుక్రవారం విడుదలైన డెకాయిట్ స్లో అండ్ స్టడీగా ఉంది. టాక్ డీసెంట్ గా ఉండటం, ప్రమోషన్లు జనాలకు చేరడం,…
ఆంధ్రప్రదేశ్లో ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యేల పనితీరును చంద్రబాబు మరోసారి రాబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 164 స్థానాల్లో కూటమి పార్టీల నాయకులు…
పేరుకేమో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీల్లో ఒకటిగా పేరు. భారీ బడ్జెట్లు, రికార్డు బిజినెస్లు, కళ్లు చెదిరే పారితోషకాలు.. చివరికి చూస్తేనేమో వసూళ్లు…
ఓట్ల తొలగింపు అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ఓట్లు కోల్పోయిన వారి వల్ల ఎన్నికలు ప్రభావితం (ఎఫెక్ట్)…
తన మంత్రి వర్గంలోని సభ్యుల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తరచుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారు…