ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు అతడి కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. అనుకున్నట్లే ఇది పూర్తి స్థాయి ప్రేమకథ అనే విషయాన్ని సూచించేలా ఫస్ట్ లుక్ను తీర్చిదిద్దారు. ఐతే ప్రభాస్ సినిమా అంటే ఉన్న హైప్కు తగ్గట్లయితే ఫస్ట్ లుక్ లేదన్నది స్పష్టం.
డిజాస్టర్ అయిన ‘సాహో’ సినిమాకు కూడా ప్రోమోలు వదిలినపుడు ఓ రేంజ్ హైప్ కనిపించింది. కానీ ‘రాధేశ్యామ్’ విషయంలో అలాంటి హంగామా ఏమీ కనిపించడం లేదు. సినిమాపై అంచనాలు పెంచేలా అయితే ఫస్ట్ లుక్ లేదు. జనాలు ఎక్కువ చర్చించుకునేలా.. స్పెషల్ అనిపించేలా అయితే లుక్ లేదు.
అన్నింటికీ మించి ఫస్ట్ లుక్ ‘ఒరిజినల్’ అనిపించేలా లేదు. అందులో చాలా వరకు ఫొటోషాప్ వర్క్ ఉండటంతో ఒరిజినాలిటీ మిస్ అయింది. ఇన్నాళ్లు ఊరించి ఊరించి ఇలాంటి లుక్కా వదిలేది అన్న వ్యాఖ్యలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
ఫస్ట్ లుక్కు సంబంధించి ఫొటో షాప్ వర్క్లోనూ అంతగా పనితనం పనితనం కనిపించలేదు. ప్రభాస్ చేతి వేళ్ల దగ్గర గమనిస్తే ఈ వర్క్ ఎంత పూర్ అనే విషయం స్పష్టమైపోతుంది. చూపుడు వేలు మరీ లావుగా, కృత్రిమంగా కనిపిస్తోంది. ఆ వేళ్లకు ఫొటో షాప్ టచ్ ఇచ్చిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. అక్కడ అసలేమాత్రం సహజత్వం లేదు. రఫ్గా ఉన్న వేళ్లను నునుపుతేల్చే ప్రయత్నంలో కృత్రిమంగా తయారు చేశారు.
ఇలాంటి పెద్ద సినిమా ఫస్ట్ లుక్ అంటే.. జనాలు అణువణువునా శోధిస్తారు. చిన్న లోపం ఉన్నా ఎలివేట్ అయిపోతుంది. ఓవరాల్గా ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమంత ఎగ్జైటింగ్గా లేదు. ఇందులో సహజత్వం లోపించడం పెద్ద మైనస్ అయింది. దీని బదులు ఏ ఫొటో షాప్ వర్క్ లేకుండా క్లోజప్లో హీరో హీరోయిన్ల ఒరిజినల్ లుక్స్తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
This post was last modified on July 10, 2020 4:50 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…