ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు అతడి కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. అనుకున్నట్లే ఇది పూర్తి స్థాయి ప్రేమకథ అనే విషయాన్ని సూచించేలా ఫస్ట్ లుక్ను తీర్చిదిద్దారు. ఐతే ప్రభాస్ సినిమా అంటే ఉన్న హైప్కు తగ్గట్లయితే ఫస్ట్ లుక్ లేదన్నది స్పష్టం.
డిజాస్టర్ అయిన ‘సాహో’ సినిమాకు కూడా ప్రోమోలు వదిలినపుడు ఓ రేంజ్ హైప్ కనిపించింది. కానీ ‘రాధేశ్యామ్’ విషయంలో అలాంటి హంగామా ఏమీ కనిపించడం లేదు. సినిమాపై అంచనాలు పెంచేలా అయితే ఫస్ట్ లుక్ లేదు. జనాలు ఎక్కువ చర్చించుకునేలా.. స్పెషల్ అనిపించేలా అయితే లుక్ లేదు.
అన్నింటికీ మించి ఫస్ట్ లుక్ ‘ఒరిజినల్’ అనిపించేలా లేదు. అందులో చాలా వరకు ఫొటోషాప్ వర్క్ ఉండటంతో ఒరిజినాలిటీ మిస్ అయింది. ఇన్నాళ్లు ఊరించి ఊరించి ఇలాంటి లుక్కా వదిలేది అన్న వ్యాఖ్యలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.
ఫస్ట్ లుక్కు సంబంధించి ఫొటో షాప్ వర్క్లోనూ అంతగా పనితనం పనితనం కనిపించలేదు. ప్రభాస్ చేతి వేళ్ల దగ్గర గమనిస్తే ఈ వర్క్ ఎంత పూర్ అనే విషయం స్పష్టమైపోతుంది. చూపుడు వేలు మరీ లావుగా, కృత్రిమంగా కనిపిస్తోంది. ఆ వేళ్లకు ఫొటో షాప్ టచ్ ఇచ్చిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. అక్కడ అసలేమాత్రం సహజత్వం లేదు. రఫ్గా ఉన్న వేళ్లను నునుపుతేల్చే ప్రయత్నంలో కృత్రిమంగా తయారు చేశారు.
ఇలాంటి పెద్ద సినిమా ఫస్ట్ లుక్ అంటే.. జనాలు అణువణువునా శోధిస్తారు. చిన్న లోపం ఉన్నా ఎలివేట్ అయిపోతుంది. ఓవరాల్గా ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమంత ఎగ్జైటింగ్గా లేదు. ఇందులో సహజత్వం లోపించడం పెద్ద మైనస్ అయింది. దీని బదులు ఏ ఫొటో షాప్ వర్క్ లేకుండా క్లోజప్లో హీరో హీరోయిన్ల ఒరిజినల్ లుక్స్తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
This post was last modified on July 10, 2020 4:50 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…