సీమ టపాకాయ్, అవును సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించిన మలయాళ హీరోయిన్ పూర్ణ. ముస్లిం అయిన ఆమె అసలు పేరు షమ్మ ఖాసిమ్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు పూర్ణగానే పరిచయం. సినిమాల్లో అవకాశాలు తగ్గాక బుల్లితెరపై దృష్టిసారించి అక్కడ పలు షోల్లో దర్శనం ఇస్తున్న పూర్ణ.. కొన్ని నెలల కిందట పెళ్లి వార్తతో మీడియా దృష్టిని ఆకర్షించింది.
షానిద్ అసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్నట్లు స్వయంగా పూర్ణనే వెల్లడించింది. నిశ్చితార్థం తర్వాత పెళ్ళికి ఎక్కువ గ్యాప్ రావడంతో పూర్ణ నిజంగానే షానిద్ను పెళ్లాడుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. పెళ్లి రద్దయినట్లు కూడా పుకార్లు షికారు చేశాయి. కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ పూర్ణ అతణ్నే పెళ్లాడింది. దుబాయిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పూర్ణ-షానిద్ల పెళ్లి వైభవంగా జరిగింది.
పెళ్లి అనంతరం పూర్ణ స్వయంగా ఫొటోలు రిలీజ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు పెట్టింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో పూర్ణ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘‘నేను ఈ ప్రపంచంలో అత్యంత అందమైన మహిళను కాకపోవచ్చు. అలాగే ఒక మంచి భార్యకు ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ నాకు లేకపోవచ్చు. కానీ నేను ఎవ్వరికీ తక్కువ కాదని నేను ఫీలయ్యేలా నువ్వు చేశావు. నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం లేకుండా నేను నేనుగా ఉండేలా నువ్వు చూసుకున్నావు. అందుకే నేను నా పనిని స్వేచ్ఛగా చేసుకుంటూ నా అత్యుత్తమ ప్రతిభను బయటపెట్టుకోగలుగుతున్నాను. ఈ రోజు మన బంధువులు, సన్నిహితుల సమక్షంలో నీతో అద్భుత ప్రయాణాన్ని మొదలుపెడుతున్నా. ఎలాంటి సమయంలో అయినా నేను నీతో తోడు ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా’’ అంటూ భర్తను ఉద్దేశించి ఆమె ఈ పోస్టులో పేర్కొంది.
This post was last modified on October 25, 2022 11:41 am
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…
పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…