స్టార్ హీరోల పుట్టిన రోజులు, ఇంకేవైనా స్పెషల్ డేలకు పాత సినిమాలను రీ రిలీజ్ చేసుకుని అభిమానులు హంగామా చేయడం బాగానే ఉంది. ఈ సెలబ్రేషన్లు చూసి వారెవా అనుకుంటున్నారు. ఐతే ఆ సంబరాలు మరీ శ్రుతి మించి పోతుండడమే ఆందోళన కలిగిస్తోంది.
పోకిరి సినిమాకు కాకినాడలోని ఒక థియేటర్కు స్పెషల్ షో వేసిన సందర్భంగా విధ్వంసం జరిగి ఇకపై ఇలాంటి స్పెషల్ షోలు వేయకూడదని అక్కడి ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆ తర్వాత జల్సా సినిమా విషయంలోనూ కొన్ని థియేటర్లలో ఇలాగే జరిగింది. థియేటర్లను దారుణంగా దెబ్బ తీశారు. విశాఖలోని ఒక థియేటర్లో సీట్లన్నీ ధ్వంసమయ్యాయి. స్క్రీన్ కూడా దెబ్బ తింది. ఆ థియేటర్ యజమాని ఈ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ అనుభవాలు చూశాక అయినా మిగతా హీరోల అభిమానులు మారుతారేమో అనుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. తాజాగా ప్రభాస్ అభిమానులు ఇలాగే హద్దులు దాటారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో బిల్లా మూవీ స్పెషల్ షో సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
థియేటర్ లోపల టపాకాయలు పేల్చే క్రమంలో థియేటర్కు నిప్పు పెట్టేశారు. సీట్లకు నిప్పంటుకుని భీతావహ పరిస్థితి నెలకొనడంతో అభిమానులు భయపడి పారిపోయారు. థియేటర్ సిబ్బంది వచ్చి మంటలార్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఒకవేళ మంటలు విస్తరించి థియేటర్ తగలబడిపోతే ఏంటి పరిస్థితి.
కోట్లల్లో నష్టం తప్పేది కాదు. ఇక ప్రాణనష్టం జరిగి ఉంటే దారుణంగా ఉండేది. ఇలాంటి ఉదంతాలు ఈ స్పెషల్ షోల విషయంలో అందరూ పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి.
This post was last modified on October 23, 2022 8:19 pm
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…