సినిమా పర్లేదు , బాగానే ఉంది అనిపించుకుంటే సరిపోదు… థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించే స్టామినా కూడా హీరోకి అవసరం. తాజాగా కుర్ర హీరో విశ్వక్ సేన్ కి అలాంటి సమస్యే ఎదురవుతుంది. దీపావళి స్పెషల్ గా నాలుగు సినిమాలతో కలిసి విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ రిలీజైంది. విక్టరీ వెంకటేష్ మోడ్రన్ గాడ్ గా కనిపించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు అశ్వత్ దర్శకత్వం వహించాడు. తమిళ్ లో సూపర్ హిట్టైన ‘ఓ మై కడవులే’ కి రీమేక్ గా తెరకెక్కింది. ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ రీమేక్ కలెక్షన్స్ లో ఆ జోరు చూపించడం లేదు.
వీకెండ్ పైగా దీపావళి ఫెస్టివల్ ఇలా అన్ని కలిసొచ్చినా సినిమా ఆశించిన రెవెన్యూ రాబట్టలేకపోతుంది. విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ కి కూడా ఇదే జరిగింది. సినిమా బాగుంది అనే టాక్ అందుకున్న అది థియేటర్స్ లో గట్టిగా పెర్ఫాం చేయలేకపోయింది. ఒటీటీ లో కి వచ్చాక జనాలు బాగానే చూశారు కానీ థియేటర్స్ కి మాత్రం కదలలేదు.
సో విశ్వక్ సేన్ హీరోగా డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ మంచి కంటెంట్ ఆడియన్స్ ముందుకొస్తున్నప్పటికీ ఈ కుర్ర హీరోకి థియేటర్స్ లో ఆశించిన ఫలితం మాత్రం అందడం లేదు. మరి దివాలి నుండి సినిమా పికప్ అయితే ఓ మోస్తరు కలెక్షన్స్ తో అందరూ సేఫ్ అవుతారు. వెంకటేష్ కూడా ఉన్నాడు కాబట్టి ఫెస్టివల్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి ఫైనల్ రన్ లో విశ్వక్ ఓరి దేవుడా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
This post was last modified on October 23, 2022 3:21 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…