Movie News

ప్రభాస్ వదులుకున్న బ్లాక్ బస్టర్లు

డార్లింగ్ ఫ్యాన్స్ కు అక్టోబర్ 23 అంటే మాములు సంబరం కాదు. తమ అభిమాన హీరో పుట్టినరోజుని చాలా గొప్పగా సెలెబ్రేట్ చేసుకోవడం ప్రతి ఏడాది జరిగేదే. ఈసారి బిల్లా 4కె స్పెషల్ షోలతో పాటు కొత్త సినిమాల అప్డేట్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ సందర్భంగా కొన్ని అరుదైన వీడియోలు బయటికి వస్తున్నాయి. అందులో మున్నా ఓపెనింగ్ ఒకటి. 2007లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో అయిదో చిత్రం. విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

దిల్ రాజు ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ముందు వినిపించిన కథ ఆర్య. అలాంటి లవ్ స్టోరీ తనకు సూట్ అవుతుందో లేదో పైగా కొత్త దర్శకుడు సుకుమార్ అనే మీమాంసలో ఎక్కువ టైం గడిచిపోవడంతో అది కాస్తా అల్లు అర్జున్ కు వెళ్లిపోయింది. గంగోత్రిలో నటనకు వచ్చిన కామెంట్స్ కి సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ కు అది సూపర్ బ్రేక్ ఇచ్చింది. తర్వాత భద్ర స్టోరీ నెరేషన్ ఇప్పించారు. ఇక్కడా ప్రభాస్ డైలమాలో పడ్డాడు. బోయపాటి శీనుకీ ఇది డెబ్యూ మూవీ. ఫ్యాక్షన్ డ్రామా ఎందుకులెమ్మని అదీ వద్దనుకున్నారు. కట్ చేస్తే మున్నా టైం వచ్చింది.

ఈసారి దిల్ రాజు మరో కొత్త కుర్రాడు వంశీ పైడిపల్లితో చెప్పించిన లైన్ ప్రభాస్ కు నచ్చేసింది. దుర్మార్గుడైన తండ్రి మీద కొడుకు తీర్చుకునే రివెంజ్ డ్రామా పర్ఫెక్ట్ అని భావించాడు. కట్ చేస్తే చకచకా షూటింగు మొదలైపోయింది. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద మున్నా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ప్రభాస్ చాలా స్టయిలిష్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసినా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఎస్విసి బ్యానర్ కు నష్టాలు తప్పలేదు. ఒకవేళ ఆర్య చేసుంటే ఎలా ఉండేదోనన్న ఊహ డిఫరెంట్ గా అనిపిస్తోంది. రవితేజకు వెళ్లిన భద్రను ఓకే చేసినా మిర్చి కన్నా ముందే పవర్ ఫుల్ హిట్టు పడేది. కొన్నిసార్లు అలా జరిగిపోతాయి.

This post was last modified on October 22, 2022 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

22 minutes ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

23 minutes ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

3 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

6 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

8 hours ago