డార్లింగ్ ఫ్యాన్స్ కు అక్టోబర్ 23 అంటే మాములు సంబరం కాదు. తమ అభిమాన హీరో పుట్టినరోజుని చాలా గొప్పగా సెలెబ్రేట్ చేసుకోవడం ప్రతి ఏడాది జరిగేదే. ఈసారి బిల్లా 4కె స్పెషల్ షోలతో పాటు కొత్త సినిమాల అప్డేట్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ సందర్భంగా కొన్ని అరుదైన వీడియోలు బయటికి వస్తున్నాయి. అందులో మున్నా ఓపెనింగ్ ఒకటి. 2007లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో అయిదో చిత్రం. విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా గ్రాండ్ ఓపెనింగ్ చేశారు. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
దిల్ రాజు ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ముందు వినిపించిన కథ ఆర్య. అలాంటి లవ్ స్టోరీ తనకు సూట్ అవుతుందో లేదో పైగా కొత్త దర్శకుడు సుకుమార్ అనే మీమాంసలో ఎక్కువ టైం గడిచిపోవడంతో అది కాస్తా అల్లు అర్జున్ కు వెళ్లిపోయింది. గంగోత్రిలో నటనకు వచ్చిన కామెంట్స్ కి సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ కు అది సూపర్ బ్రేక్ ఇచ్చింది. తర్వాత భద్ర స్టోరీ నెరేషన్ ఇప్పించారు. ఇక్కడా ప్రభాస్ డైలమాలో పడ్డాడు. బోయపాటి శీనుకీ ఇది డెబ్యూ మూవీ. ఫ్యాక్షన్ డ్రామా ఎందుకులెమ్మని అదీ వద్దనుకున్నారు. కట్ చేస్తే మున్నా టైం వచ్చింది.
ఈసారి దిల్ రాజు మరో కొత్త కుర్రాడు వంశీ పైడిపల్లితో చెప్పించిన లైన్ ప్రభాస్ కు నచ్చేసింది. దుర్మార్గుడైన తండ్రి మీద కొడుకు తీర్చుకునే రివెంజ్ డ్రామా పర్ఫెక్ట్ అని భావించాడు. కట్ చేస్తే చకచకా షూటింగు మొదలైపోయింది. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద మున్నా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ప్రభాస్ చాలా స్టయిలిష్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసినా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఎస్విసి బ్యానర్ కు నష్టాలు తప్పలేదు. ఒకవేళ ఆర్య చేసుంటే ఎలా ఉండేదోనన్న ఊహ డిఫరెంట్ గా అనిపిస్తోంది. రవితేజకు వెళ్లిన భద్రను ఓకే చేసినా మిర్చి కన్నా ముందే పవర్ ఫుల్ హిట్టు పడేది. కొన్నిసార్లు అలా జరిగిపోతాయి.
This post was last modified on October 22, 2022 9:24 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…