దసరా సందడి ముగిసింది. దీపావళి హంగామా నడుస్తోంది. ఇక తర్వాత అందరి దృష్టీ సంక్రాంతి మీదికి మళ్లబోతోంది. తెలుగు సినిమాలకు సంబంధించి అతి పెద్ద పండుగ సీజన్ అయిన సంక్రాంతికి దాదాపుగా బెర్తులు ఖరారైపోయినట్లే. ఈసారి ఏకంగా నాలుగు భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజైన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ.. అందులో రెండుకు మించి భారీ సినిమాలుండేవి కావు.
రెండు పెద్ద సినిమాలు రిలీజైతే.. వాటికి తోడు ఒకటో రెండో మీడియం రేంజ్ సినిమాలు రిలీజయ్యాయి. అయినా సరే థియేటర్లు సర్దుబాటు చేయడం చాలా కష్టంగా ఉండేది. కానీ 2023 సంక్రాంతికి మాత్రం రిలీజవుతున్న నాలుగు సినిమాలూ భారీ స్థాయివే. అందులో ప్రభాస్ మూవీ ‘ఆదిపురుష్’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతుండగా.. చిరంజీవి చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’, బాలయ్య సినిమా ‘వీరసింహారెడ్డి’ తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదల మీద కన్నేశాయి. వీటికి తోడు ద్విభాషా చిత్రం ‘వారసుడు’ కూడా ఉంది.
ఈ నాలుగు చిత్రాల వెనుక భారీ నిర్మాణ సంస్థలే ఉన్నాయి. థియేటర్ల విషయంలో ఎవరికి వారు గట్టిగా లాబీయింగ్ చేసుకోగల వాళ్లే. మరి వీరి మధ్య ఏమాత్రం సర్దుబాటు జరుగుతుందో.. థియేటర్ల కేటాయింపు ఏమాత్రం సవ్యంగా సాగుతుందో చూడాలి. ఈ సంగతి పక్కన పెడితే.. ఇలా నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడడం వల్ల కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. నాలుగుకు నాలుగు సినిమాలూ చూసే ప్రేక్షకులు అరుదు. టాక్ను బట్టి రెండు సినిమాలను ఎంచుకుంటారు. అలాంటపుడు టాక్ బాగా లేని సినిమాల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అసలే తక్కువ థియేటర్లలో రిలీజవుతాయి కాబట్టి ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండవు. ఇలాంటి పరిస్థితిలో సినిమాను రిలీజ్ చేయడం చాలా డేంజర్ అనే చెప్పాలి.
ఎవరికి వాళ్లు తమ సినిమా మీద ధీమాగానే ఉంటారు కానీ.. థియేటర్లలోకి దిగాక కథ వేరుంటుంది. తుది నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. పబ్లిసిటీతో మాయ చేయడం కూడా కష్టం. ప్రేక్షకుల తీర్పు చాలా స్పష్టంగా ఉండే టైం అది. ఈ స్థితిలో ఒకట్రెండు సినిమాలకు గట్టి పంచ్ తప్పదు. అలా అన్యాయం అయిపోయే సినిమాలేవో చూడాలి.
This post was last modified on October 22, 2022 7:59 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…