Movie News

ఒట్టు తీసి గట్టున పెట్టిన బాలయ్య


ఒకప్పుడు టాలీవుడ్ హీరోలు ఏవైనా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, ప్రకటనలు చేయడాన్ని తక్కువగా చూసేవాళ్లు. ఓవైపు బాలీవుడ్ స్టార్లు పెద్ద స్థాయిలో ప్రకటనలు చేస్తుంటే.. మన హీరోలు మాత్రం అటు వైపు చూసేవారే కాదు. ఐతే చిరంజీవి ఈ విషయంలో ముందడుగు వేసి ‘థమ్సప్’ లాంటి ఒకటీ అరా యాడ్స్ చేశారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘పెప్సి’కి ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత ఆ ఇద్దరూ ప్రకటనల వైపు చూడలేదు.

ఐతే యాడ్స్ చేస్తే సినిమాలను మించి ఆదాయం సంపాదించవచ్చని గ్రహించిన సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాళ్లు ముందడుగు వేశారు. ఇప్పుడు మహేష్ చేతిలో రెండంకెల సంఖ్యలో బ్రాండ్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ సైతం పెద్ద ఎత్తున బ్రాండ్లు దక్కించుకున్నాడు. మిగతా స్టార్ హీరోలు కూడా చాలామంది ప్రకటనల్లో నటిస్తున్నారు. మంచి పే చెక్ అందుకుంటున్నారు.

ఐతే హీరోగా దాదాపు నలభై ఏళ్ల అనుభవం ఉన్న నందమూరి బాలకృష్ణ ఇన్నేళ్లలో ఎప్పుడూ ప్రకటనల జోలికి వెళ్లలేదు. చాలాసార్లు చాలా బ్రాండ్లు ఆయన్ని సంప్రదించినా పట్టించుకోలేదు. తాను ఇలా బ్రాండ్లను ప్రచారం చేయడానికి విరుద్ధం అన్నట్లు మాట్లాడేవారు బాలయ్య. ఐతే ఇన్నాళ్లు ఆ మాటకే కట్టుబడి ఉన్న బాలయ్య ఇప్పుడు ఆ మాట తీసి పక్కన పెట్టేశారు. బాలయ్య సాయి ప్రియ అనే కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు.

ఈ రియల్ ఎస్టేట్ సంస్థ బాలయ్యతో ఒక పెద్ద డీల్ చేసుకుని ఆయనతో ఆల్రెడీ ఒక కమర్షియల్‌ చిత్రీకరణ కూడా పూర్తి చేసింది. ఈ ప్రకటనలో రోల్స్ రాయిస్ కారులో ఎంట్రీ ఇస్తూ రాయల్‌గా కనిపించబోతున్నాడు బాలయ్య. శ్రేయస్ మీడియా ఈ ప్రకటనను రూపొందించింది. ఎన్బీకే 1 అని నంబర్ రాసి ఉన్న రోల్స్ రాయిస్ కారును ఈ ప్రకటనకు సంబంధించి టీజర్ పోస్టర్లో చూపించారు. బాలయ్యకు ప్రకటనల రంగంలోకి ఆహ్వానిస్తూ ఈ పోస్టర్ లాంచ్ చేశారు. మరి ఈ యాడ్‌లో బాలయ్య ఎలా సందడి చేయబోతున్నాడో చూడాలి.

This post was last modified on October 22, 2022 7:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

40 minutes ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

41 minutes ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

12 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

14 hours ago