Movie News

హీరోయిన్‌‌కు అల్లు అరవింద్ లైవ్ పంచ్

టాలీవుడ్లో నిర్మొహమాటంగా మాట్లాడే నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఐతే ఏ విషయం మీదైనా ఓపెన్‌గా మాట్లాడే ఆయన కఠినత్వం అయితే ప్రదర్శించరు. వేదికల మీద చాలా వరకు సరదాగానే మాట్లాడతారు. అలా సరదాగానే అవతలి వాళ్ల మీద పంచ్‌లు వేసేస్తారు. తాజాగా ఆయన తన నిర్మాణంలో తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్‌కు చురకలంటించారు.

గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఒక హోటల్లో ఈ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రోగ్రాం మొదలుపెట్టే సమయానికి హీరో అల్లు శిరీష్, నిర్మాత అల్లు అరవింద్ సహా యూనిట్లో ప్రధాన సభ్యులందరూ వచ్చేశారు. కానీ కథానాయిక అను ఇమ్మాన్యుయెల్ మాత్రం అక్కడ కనిపించలేదు. ప్రెస్ మీట్ మొదలుపెట్టి ముందుకు నడిపిస్తుంటే ఆమె వస్తుందిలే అని ముందుకెళ్లిపోయారు.

కానీ అందరూ మాట్లాడేస్తున్నా, ప్రెస్ మీట్ చివరికి వస్తున్నా అను అక్కడ కనిపించలేదు. అల్లు అరవింద్ మైక్ అందుకుని మాట్లాడుతుండగా.. వేదికలోకి అడుగు పెట్టింది అను. ఆమెను గమనించిన అరవింద్.. సినిమా ప్రస్తావన పక్కన పెట్టి అనుకు స్వాగతం పలికాడు. ఈవెంట్ ఇక ముగియబోతుండగా అను వచ్చిందని, ఇంకాసేపు అయితే ఈవెంట్ అయిపోయేదని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఆమె స్టేజ్ మీదికి చేరుకున్నాక కూడా ఈ విషయాన్ని ఆయన వదిలిపెట్టలేదు. ఆమె దగ్గరికి వచ్చి తనకు సమాచారం ఇచ్చిన వ్యక్తిదే తప్పు అని, టైం తప్పు చెప్పాడని అరవింద్‌కు సమాచారం ఇచ్చింది.

ఐతే ఆ వ్యక్తి పేరు ప్రస్తావిస్తూ నీదే తప్పంట, నువ్వే టైమింగ్ సరిగా చెప్పలేదంట అని అరవింద్ అన్నారు. హీరో హీరోయిన్లు ఏం చెప్పినా కరెక్ట్, నాదే తప్పు అని చెప్పాలి. అదే ఇక్కడ రూల్. తెలుసు కదా అంటూ ఆయన పరోక్షంగా ఇలా లేటుగా వచ్చే హీరో హీరోయిన్లందరికీ కౌంటర్ ఇచ్చారు. కానీ వ్యవహారం సీరియస్ అవకుండా సరదాగా మాట్లాడడంతో ఆ టాపిక్ అక్కడితో ఎండ్ అయిపోయింది.

This post was last modified on October 21, 2022 8:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

40 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago