అడపాదడపా హిట్లున్నా భారీ సంఖ్యలో ఫ్లాపులే ఎక్కువ చూసిన సందీప్ కిషన్ కు మొదటి ప్యాన్ ఇండియా మూవీ మైఖేల్. మొన్నటిదాకా పెద్దగా అంచనాలేం లేవు ట్రైలర్ చూశాక మాత్రం నమ్మకం కలిగించేలానే ఉంది. అలా అని ఎప్పుడూ టచ్ చేయని జానరేం కాదు. మాఫియా రౌడీయిజం షేడ్స్ లో సాగినప్పటికీ టేకింగ్ లో మంచి ఇంటెన్సిటీతో పాటు పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఆసక్తి రేపెలా ఉంది. యాక్షన్ ఎంటర్ టైనరని క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకోకుండా విక్రమ్ తరహాలో ప్రత్యేక వర్గం ప్రేక్షకులను మైఖేల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
పేరుకు టీజర్ లెన్త్ చిన్నదే ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రం సాలిడ్ గా అనిపిస్తోంది. పైగా దీని లాంచ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఇది హిట్ కాకపోతే ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగడమే కరెక్ట్ కాదన్న రీతిలో మాట్లాడ్డం చూస్తే ఆ నమ్మకం వెనుక బలమైన కారణమే కనిపిస్తోంది. మజిలీ, రామారావు ఆన్ డ్యూటీ ఫేమ్ దివ్యంశ కౌశిక్ హీరోయిన్ గా నటించగా ఫెరోషియస్ లుక్ లో విజయ్ సేతుపతి మరోసారి పవర్ ఫుల్ క్యారెక్టర్ దక్కించుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ, అయ్యప్ప శర్మ ఇలా భారీ తారాగణాన్ని సెట్ చేసుకున్నాడు.
మైఖేల్ కి దర్శకుడు రంజిత్ జయకోడి. ఇతను మనకు పరిచయం లేదు కానీ తమిళంలో ఇలాంటివే మూడు విలక్షణమైన సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు. వాటిలో ఒకటి పిజ్జా 2 పేరుతో తెలుగులో డబ్ చేశారు కానీ ఇక్కడెవరూ పట్టించుకోలేదు. మొత్తానికి మైఖేల్ లో మ్యాటర్ ఉందనే క్లారిటీ అయితే ఇచ్చారు. తనకు సూట్ కాని కథలతో ఇప్పటిదాకా ఏవేవో చేసుకుంటూ వచ్చిన సందీప్ కి దీని సక్సెస్ చాలా కీలకం. పైగా మల్టీ లాంగ్వేజెస్ లో విడుదలవుతుంది కాబట్టి ఏ మాత్రం అటుఇటు అయినా ఇబ్బందే. రిలీజ్ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఏంటో ఈ మధ్య అందరూ ఇంటెన్స్ డ్రామాల మీద పడుతున్నారు.
This post was last modified on October 21, 2022 6:32 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…