Movie News

మైఖేల్ లో మ్యాటర్ ఉందే

అడపాదడపా హిట్లున్నా భారీ సంఖ్యలో ఫ్లాపులే ఎక్కువ చూసిన సందీప్ కిషన్ కు మొదటి ప్యాన్ ఇండియా మూవీ మైఖేల్. మొన్నటిదాకా పెద్దగా అంచనాలేం లేవు ట్రైలర్ చూశాక మాత్రం నమ్మకం కలిగించేలానే ఉంది. అలా అని ఎప్పుడూ టచ్ చేయని జానరేం కాదు. మాఫియా రౌడీయిజం షేడ్స్ లో సాగినప్పటికీ టేకింగ్ లో మంచి ఇంటెన్సిటీతో పాటు పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఆసక్తి రేపెలా ఉంది. యాక్షన్ ఎంటర్ టైనరని క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకోకుండా విక్రమ్ తరహాలో ప్రత్యేక వర్గం ప్రేక్షకులను మైఖేల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

పేరుకు టీజర్ లెన్త్ చిన్నదే ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రం సాలిడ్ గా అనిపిస్తోంది. పైగా దీని లాంచ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఇది హిట్ కాకపోతే ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగడమే కరెక్ట్ కాదన్న రీతిలో మాట్లాడ్డం చూస్తే ఆ నమ్మకం వెనుక బలమైన కారణమే కనిపిస్తోంది. మజిలీ, రామారావు ఆన్ డ్యూటీ ఫేమ్ దివ్యంశ కౌశిక్ హీరోయిన్ గా నటించగా ఫెరోషియస్ లుక్ లో విజయ్ సేతుపతి మరోసారి పవర్ ఫుల్ క్యారెక్టర్ దక్కించుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ, అయ్యప్ప శర్మ ఇలా భారీ తారాగణాన్ని సెట్ చేసుకున్నాడు.

మైఖేల్ కి దర్శకుడు రంజిత్ జయకోడి. ఇతను మనకు పరిచయం లేదు కానీ తమిళంలో ఇలాంటివే మూడు విలక్షణమైన సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు. వాటిలో ఒకటి పిజ్జా 2 పేరుతో తెలుగులో డబ్ చేశారు కానీ ఇక్కడెవరూ పట్టించుకోలేదు. మొత్తానికి మైఖేల్ లో మ్యాటర్ ఉందనే క్లారిటీ అయితే ఇచ్చారు. తనకు సూట్ కాని కథలతో ఇప్పటిదాకా ఏవేవో చేసుకుంటూ వచ్చిన సందీప్ కి దీని సక్సెస్ చాలా కీలకం. పైగా మల్టీ లాంగ్వేజెస్ లో విడుదలవుతుంది కాబట్టి ఏ మాత్రం అటుఇటు అయినా ఇబ్బందే. రిలీజ్ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఏంటో ఈ మధ్య అందరూ ఇంటెన్స్ డ్రామాల మీద పడుతున్నారు.

This post was last modified on October 21, 2022 6:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్‌తో వారం షూటింగ్ చేసి బయటికి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎంతో ఎగ్జైట్ అవుతుంది. స్టార్ హీరోయిన్లు అయినా…

2 hours ago

జనవరి వచ్చిందంటూ గుర్తుచేస్తున్న షర్మిల

ఏటా జనవరి వస్తోంది.. పోతుంది... సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నాయి అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల గుర్తు చేస్తున్నారు. ఇది…

3 hours ago

ముగిసిన `మండ‌లి`- క‌విత స్పీచే రికార్డ్‌!

తెలంగాణ శాస‌న మండ‌లి శీతాకాల‌ స‌మావేశాలు ముగిశాయి. ఈ సీజ‌న్‌లో మొత్తం 5 రోజుల పాటు మాత్ర‌మే ఈ స‌మావేశాలు…

6 hours ago

గిల్ ను చూసి అభిషేక్ ఏం నేర్చుకోవాలి?

టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…

6 hours ago

హద్దు దాటిన రోజా: ‘పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి’

నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట…

7 hours ago

మాల్దీవ్స్ తరహాలో… ఏపీలో ఐ ల్యాండ్ టూరిజం

పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030…

7 hours ago