అడపాదడపా హిట్లున్నా భారీ సంఖ్యలో ఫ్లాపులే ఎక్కువ చూసిన సందీప్ కిషన్ కు మొదటి ప్యాన్ ఇండియా మూవీ మైఖేల్. మొన్నటిదాకా పెద్దగా అంచనాలేం లేవు ట్రైలర్ చూశాక మాత్రం నమ్మకం కలిగించేలానే ఉంది. అలా అని ఎప్పుడూ టచ్ చేయని జానరేం కాదు. మాఫియా రౌడీయిజం షేడ్స్ లో సాగినప్పటికీ టేకింగ్ లో మంచి ఇంటెన్సిటీతో పాటు పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఆసక్తి రేపెలా ఉంది. యాక్షన్ ఎంటర్ టైనరని క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకోకుండా విక్రమ్ తరహాలో ప్రత్యేక వర్గం ప్రేక్షకులను మైఖేల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
పేరుకు టీజర్ లెన్త్ చిన్నదే ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రం సాలిడ్ గా అనిపిస్తోంది. పైగా దీని లాంచ్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఇది హిట్ కాకపోతే ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగడమే కరెక్ట్ కాదన్న రీతిలో మాట్లాడ్డం చూస్తే ఆ నమ్మకం వెనుక బలమైన కారణమే కనిపిస్తోంది. మజిలీ, రామారావు ఆన్ డ్యూటీ ఫేమ్ దివ్యంశ కౌశిక్ హీరోయిన్ గా నటించగా ఫెరోషియస్ లుక్ లో విజయ్ సేతుపతి మరోసారి పవర్ ఫుల్ క్యారెక్టర్ దక్కించుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ, అయ్యప్ప శర్మ ఇలా భారీ తారాగణాన్ని సెట్ చేసుకున్నాడు.
మైఖేల్ కి దర్శకుడు రంజిత్ జయకోడి. ఇతను మనకు పరిచయం లేదు కానీ తమిళంలో ఇలాంటివే మూడు విలక్షణమైన సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు. వాటిలో ఒకటి పిజ్జా 2 పేరుతో తెలుగులో డబ్ చేశారు కానీ ఇక్కడెవరూ పట్టించుకోలేదు. మొత్తానికి మైఖేల్ లో మ్యాటర్ ఉందనే క్లారిటీ అయితే ఇచ్చారు. తనకు సూట్ కాని కథలతో ఇప్పటిదాకా ఏవేవో చేసుకుంటూ వచ్చిన సందీప్ కి దీని సక్సెస్ చాలా కీలకం. పైగా మల్టీ లాంగ్వేజెస్ లో విడుదలవుతుంది కాబట్టి ఏ మాత్రం అటుఇటు అయినా ఇబ్బందే. రిలీజ్ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఏంటో ఈ మధ్య అందరూ ఇంటెన్స్ డ్రామాల మీద పడుతున్నారు.
This post was last modified on October 21, 2022 6:32 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…