Movie News

చరణ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మీద కొంత ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగా స్టార్ అతిథిగా విచ్చేసే సినిమాల మీద యాంటీ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. చిరు గెస్ట్ గా వస్తే ఆ సినిమా సక్సెస్ కష్టమే అంటూ తీవ్రమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే వీటికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు రామ్ చరణ్ తనకున్న సెంటిమెంట్ బయట పెట్టాడు.

ఇటివల రాజమండ్రిలో జరిగిన ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన చరణ్ ఆ టీంను అభినందిస్తూ ఒక లక్కీ సెంటిమెంట్ గురించి చెప్పాడు. ఉప్పెన సినిమా ఫంక్షన్ కూడా రాజమండ్రిలోనే జరిగిందని ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందని ఇప్పుడు ఓరి దేవుడా కూడా అంతటి విజయం అందుకోవాలని ఆశిస్తున్నానని అన్నాడు. దీంతో రామ్ చరణ్ గెస్ట్ గా వస్తే సినిమా సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ అందరిలో బలపడింది.

మరి ఓరి దేవుడా మంచి సక్సెస్ సాదిస్తే మెగా స్టార్ బ్యాడ్ సెంటిమెంట్ మర్చిపోయి రామ్ చరణ్ లక్కీ సెంటిమెంట్ హైలైట్ అవుతుంది. ఇకపై రామ్ చరణ్ ని చిన్న సినిమాలకు గెస్ట్ గా తీసుకురావడం మీద మిగతా యంగ్ హీరోలు ఫోకస్ పెడతారనిపిస్తుంది. మరి విశ్వక్ సేన్ సినిమాకు చరణ్ చెప్పిన సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ? చూడాలి.

ఓమై కడవులే అనే తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటించాడు. అన్ని కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీవీపీ సినిమా నిర్మించిన ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. సినిమా మీద కొంత బజ్ అయితే ఉంది మరి బాక్సాఫీస్ దగ్గర పోటీ నడుమ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో..?

This post was last modified on October 21, 2022 6:28 am

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

2 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

3 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

4 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

4 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

4 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

4 hours ago