ఈ శుక్రవారం తెలుగులో నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ ఒకటి. ఈ సినిమాలో వెంకటేష్ మోడరన్ గాడ్ కేరెక్టర్ లో కనిపించనున్నాడు. అయితే సినిమాలో కీలక పాత్ర పోషించిన వెంకీ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. దీని గురించి తాజాగా హీరో విశ్వక్ ను ఇంటర్వ్యూలో మీడియా ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చాడు.
వెంకటేష్ గారు ముంబైలో సల్మాన్ ఖాన్ గారితో హిందీ సినిమా షూట్ లో ఉన్నారని.. ఆ కారణంగానే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయారని.. అందుకే స్పెషల్ గా బైట్ చెప్పి పంపారని తెలిపాడు. వెంకటేష్ గారు కేవలం నాలుగు రోజులు మాత్రమే షూట్ లో పాల్గొన్నారని.. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాని అన్నాడు. నేను సినిమా సైన్ చేసినప్పుడు దేవుడి పాత్ర కి వెంకటేష్ గారి పేరు ఉంది.
కానీ మధ్యలో ఒకరిద్దరిని అనుకొని ఫైనల్ గా మళ్ళీ వెంకటేష్ గారే చేయాల్సి వచ్చింది. ఈ రోల్ ఆయనకే రాసిపెట్టుందని అనిపించిందన్నాడు. ఇక బాలయ్య గారితో అన్ స్టాపబుల్ షో లో పాల్గొనడం కిక్ ఇచ్చిందని విశ్వక్ చెప్పాడు. ఆయన షో లో మేన్షన్ హౌజ్ గురించి అడగాలని ఎప్పుడో ఫిక్సయ్యానని అందుకే ఆయన కలుద్దాం అనగానే వెంటనే అలా అనేశానని చెప్పాడు.
అలాగే షో స్టార్ట్ అయ్యే ముందు అరగంట టెన్షన్ తో ప్యాక్ అయ్యిందని కానీ తర్వాత ఆయన కూల్ గా మాట్లాడటంతో అంతా నార్మల్ గా అనిపించిందని చెప్పాడు. నాలుగు రిలీజ్ లు కాంపిటీషన్ గురించి కూడా విశ్వక్ రియాక్ట్ అయ్యాడు. దీపావళి కి ఎన్ని వచ్చినా బాగుంటే ఆడియన్స్ చూస్తారని మొన్నీ మధ్యే బింబిసార – సీతారామం రెండు ఒకే రోజు రిలీజై బాగా ఆడాయని గుర్తుచేశాడు. తన సినిమా అయితే బాగుందని కచ్చితంగా హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on October 20, 2022 8:18 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…