కొన్ని సినిమాలకు సంబంధించి టైటిల్ ఎనౌన్స్ మెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. అలా ప్రస్తుతం టైటిల్ ఎనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా NBK107. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఇప్పటి వరకూ #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తోనే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఇక టైటిల్ ఎనౌన్స్ మెంట్ వెయిటింగ్ కి రేపటితో చెక్ పడబోతుంది. రేపు దీపావళి సందర్భంగా టైటిల్ ఎనౌన్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అలాగే రిలీజ్ డేట్ కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు ‘అన్నగారు’, ‘రెడ్డి గారు’, వీర సింహా రెడ్డి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇవన్నీ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే వీటిలో బాలయ్య పవర్ ఫుల్ యాక్షన్ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది మాత్రం ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేసింది. ఎప్పుడూ లీకులకు తావిచ్చే మైత్రి మూవీ మేకర్స్ ఈ టైటిల్ గురించి ఎక్కడా లీకులు లేకుండా చూసుకుంటుంది. దీంతో సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేశారన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. టీం కూడా టైటిల్ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నారని తెలుస్తుంది. అనుకున్న టైటిల్స్ తో పోస్టర్స్ రెడీ చేసి ఓటింగ్ పెట్టారట.
అయితే ఎక్కువ మంది ‘వీర సింహా రెడ్డి’ కి ఓటేశారని టాక్. బాలయ్య మాత్రం ఇంకా తన డిసిషన్ చెప్పలేదట. ఇవ్వాళ ఓ ముహూర్తం చూసి వీటిలో ఒకటి సెలెక్ట్ చేస్తారని తెలుస్తుంది. మరి బాలయ్య అండ్ టీం ఏ టైటిల్ కి మొగ్గు చూపుతారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. ఫర్ ది ఫస్ట్ టైం కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కొండారెడ్డి బురుజు దగ్గర బాలయ్య ఏ టైటిల్ తో గర్జిస్తారో వేచి చూడాలి.
This post was last modified on October 20, 2022 12:52 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…