ఇంకో నాలుగు రోజుల్లో రాబోతున్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకపక్క బిల్లా 4K రీ రిలీజ్ హంగామా ఓ రేంజ్ లో పెరుగుతుండగా మరోవైపు సెట్స్ మీదున్న కొత్త సినిమాల అప్డేట్స్ ని సిద్ధం చేసే పనిలో ఆయా యూనిట్లు బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే వర్షం రీ రిలీజ్ కూడా గతంలోనే ప్లాన్ చేసుకున్నారు.
బిల్లాతో పాటు వర్షంని ఒకే రోజు స్క్రీనింగ్ చేసేలా డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమయ్యారు. కట్ చేస్తే ఇప్పుడీ డేట్లలో మార్పు వచ్చింది. వర్షంని 23కి బదులు 28న ప్రపంచవ్యాప్తంగా పునః విడుదలకు స్కెచ్ రెడీ అయిపోయింది. దీనికి కారణాలేంటనే సందేహం రావడం సహజం.
బాక్సాఫీస్ వద్ద థియేటర్ల లభ్యత చాలా టైట్ గా ఉంది. ఊహించని రేంజ్ లో కాంతార ఊచకోత కొనసాగడంతో రెండో వారంలోనూ దాని జోరు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాయి. ఓరి దేవుడా, సర్దార్, ప్రిన్స్, జిన్నాలు నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి.
మరోవైపు హాలీవుడ్ మూవీ బ్లాక్ ఆడమ్ కోసం మల్టీ ప్లెక్సుల టికెట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. దాని షోలు ఎక్కువ వేసేందుకు యాజమాన్యాలు ఇష్టపడుతున్నాయి. వీటి మధ్యలో మళ్ళీ అదనంగా బిల్లాను వేసుకోవాలి.
ఇన్ని ఒత్తిళ్ల మధ్య వర్షంని తీసుకొస్తే ఇబ్బంది పడేది సదరు నిర్మాతలు డార్లింగ్ ఫ్యాన్సే. పైగా దీనికి సంబంధించి థియేటర్ ప్రదర్శనకు కావాల్సిన డిపిఎక్స్ ఫైల్ ని సెట్ చేయడం సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని, డిటిఎస్ సౌండ్ ని సింక్ చేసే క్రమంలోనూ చిక్కులు వచ్చాయని ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే వర్షంని వారం లేట్ గా వదులుతున్నారని డిస్ట్రిబ్యూటర్ టాక్.
అయినా ఈ ప్లానింగ్ ఏదో కరెక్ట్ గా చేసుకుని ఆ డిజాస్టర్ రెబెల్ బదులు మొన్న వర్షంని వేసుకుని ఉంటే జల్సా రేంజ్ లో రెస్పాన్స్ వచ్చి ఉండేదన్న అభిమానుల అభిప్రాయంలో వాస్తవం లేకపోలేదు.
This post was last modified on October 19, 2022 12:00 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…