కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ఇటు ప్రభుత్వాలకు.. అటు బాధితులకు విరాళాలు అందిస్తున్నారు సినీ ప్రముఖులు. ఫిలిం ఇండస్ట్రీలో కార్మికుల కోసం కూడా సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ విరాళం ప్రకటించకుండా సైలెంటుగా ఉన్న సెలబ్రెటీలను నెటిజన్లు నిలదీస్తున్నారు. విరాళాలిస్తున్న వేరే వాళ్లను ఉదాహరణగా చూపించి తిడుతున్నారు.
ముఖ్యంగా విరాళాల విషయంలో వెనుకబడి ఉన్న హీరోయిన్లను బాగా టార్గెట్ చేస్తోంది సోషల్ మీడియా. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఆమె ఇప్పటిదాకా విరాళం ప్రకటించకపోవడంపై నెటిజన్లు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై శ్రుతి ఘాటుగా స్పందించింది. తాను విరాళం ఇవ్వాలనుకుంటే ఇస్తానని.. డిమాండ్ చేస్తే ఇవ్వనని ఆమె తేల్చి చెప్పింది.
ఈ సమయంలో సమాజానికి సేవ చేయండి అని కొందరు, మీరు కూడా విరాళం ఇవ్వండి అని మరికొందరు నాకు సలహాలు ఇస్తున్నారు. నాకు సలహాలు ఇచ్చే వారందరినీ నేను ఒక్కటే అడగదలుచుకున్నాను. మీరు ఏం సేవ చేస్తున్నారు? మీరు ఎంత విరాళం ఇచ్చారు? కనీసం ప్రభుత్వం ఇంట్లోనే ఉండండి అని చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అలాంటి వాళ్లా నాకు సలహాలు ఇచ్చేది? అయినా ఎవరో చెబితేగానీ విరాళం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఎప్పుడు ఇవ్వాలని అనిపిస్తుందో.. అప్పుడే ఇస్తా. దయచేసి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోండి అని తేల్చి చెప్పింది శ్రుతి.
కమల్ తనయురాలి మాటలు కొంచెం కఠినంగా ఉన్నా సరే.. విరాళం ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది సెలబ్రెటీల ఇష్టం. దాని గురించి డిమాండ్ చేయడం తగదు. అయినా అందరూ తాము చేస్తున్న సాయం గురించి బయటికి చెప్పకపోవచ్చు. ప్రచారానికి దూరంగా ఏం చేయాలో చేస్తుండొచ్చు. కాబట్టి విరాళం ప్రకటించని వారిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు.
This post was last modified on April 22, 2020 1:47 pm
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…