ఈ వారం ఏకంగా ఒకటి రెండు కాదు నాలుగు తెలుగు సినిమాలు ఒక ఇంగ్లీష్ మూవీ బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి. ఓరి దేవుడా మీద మంచి అంచనాలున్నాయి. సర్దార్ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. ప్రిన్స్ దాని దర్శకుడు అనుదీప్ బ్రాండింగ్ తో వస్తోంది కానీ చెప్పుకోదగ్గ బజ్ అయితే లేదు. శివ కార్తికేయన్ రెండు హిట్లు కొట్టినా ఇక్కడతని మార్కెట్ ఇంకా బలపడలేదు. ఇక జిన్నా టీమ్ చాలా హడావిడి చేస్తోంది కానీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలగాలంటే మొదటి షోకు ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ముందస్తుగా ఏమీ చెప్పలేం మంచు విష్ణు కాన్ఫిడెన్స్ మాత్రం పీక్స్ లో కనిపిస్తోంది.
ఇక బ్లాక్ ఆడమ్ సంగతి సరేసరి. సిటీస్ లో గట్టి ఓపెనింగ్స్ దక్కబోతున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ పండగను టార్గెట్ చేసుకుని బరిలో దిగుతున్న ఈ టపాసులకు కాంతార కొంత టెన్షన్ పెడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో దీని దూకుడు మాములుగా లేదు. కేవలం వారం రోజులకే తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సింగల్ స్క్రీన్ సోమవారం సెకండ్ షోకు హౌస్ ఫుల్ కావడం చాలా అరుదు. అందులోనూ స్టార్ హీరో లేని ఒక డబ్బింగ్ సినిమాకు. కానీ కాంతార ఇది చేసి చూపించింది. ట్రేడ్ సైతం నివ్వెరపోతోంది.
ఒకవేళ ఈ దూకుడు కనక సెకండ్ వీక్ కంటిన్యూ చేస్తే ఇబ్బందే. పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది మరి. మూడో రోజు నెమ్మదించాల్సింది పోయి పికప్ కావడం అనూహ్యం. ఇప్పుడే ఇలా ఉంటే రెండో వీకెండ్ లో మళ్ళీ రచ్చ ఉంటుంది. సో దీపావళి సినిమాలకు టాక్ చాలా కీలకంగా మారనుంది. దసరాలాగా ఈ పండక్కు ఎక్కువ సెలవులు ఉండవు. స్కూళ్ళు కాలేజీలు సైతం ఒక్క రోజే హాలిడే ఇస్తాయి. అందుకే ఫెస్టివల్ 24 అయితే మూడు రోజులు ముందే కొత్త కంటెంట్ రావడం థియేటర్లకు మంచిదే. మరి కాంతారని ఓవర్ టేక్ చేసేంత విషయం వీటిలో ఉందా చూద్దాం
This post was last modified on October 18, 2022 8:15 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…