ప్రస్తుతం ఏజెంట్ విడుదల కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ ఆశలు దాని మీద మాములుగా లేవు. కెరీర్లో మొదటిసారి లవర్ బాయ్ పాత్రలను పక్కనపెట్టి పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడమే కాదు ప్యాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించడంతో ఫ్యాన్స్ సైతం దర్శకుడు సురేందర్ రెడ్డి మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. డిసెంబర్ విడుదల ఎలాగూ సాధ్యం కాదు కనక సంక్రాంతి రేస్ నుంచి ఏదైనా పెద్ద సినిమా తప్పుకుంటే దాని స్థానంలో ఏజెంట్ ని దించేందుకు నిర్మాత అనిల్ సుంకర రెడీ అవుతున్నారన్న వార్త ఆల్రెడీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక Akhil నెక్స్ట్ చేయబోయే లిస్టులో ఇద్దరు తమిళ డైరెక్టర్లు ఉండటం దాదాపు ఖాయమైనట్టే. అందులో మొదటి వ్యక్తి మోహన్ రాజా. ఇటీవలే గాడ్ ఫాదర్ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ రీమేక్ స్పెషలిస్ట్ నాగార్జున అఖిల్ కాంబో కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. నాగ్ వందో సినిమాగా తీసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. రెండో వ్యక్తి పిఎస్ మిత్రన్. విశాల్ తో అభిమన్యుడు తీసిన దర్శకుడితను. తెలుగులోనూ బాగా ఆడిన బొమ్మది. ఈ 21న కార్తీతో సర్దార్ ని తేబోతున్నాడు. ట్రైలర్ చూశాక దీని మీదా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇతను అఖిల్ కోసం ఓ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.
ఇవి ఓకే అయితే ఇంకో ఏడాదిన్నర అక్కినేని కుర్రాడు బిజీ అయిపోతాడు. కాకపోతే ఈ రెండు అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఇంకొంత కాలం వేచి చూడాలి. అఖిల్ ఆలోచన ఒకరకంగా కరెక్టే. ఎందుకంటే ఫామ్ లో ఉన్న టాలీవుడ్ డైరెక్టర్లందరూ వాళ్ళ వాళ్ళ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఎదురు చూసి టైం వేస్ట్ చేయడం కంటే సక్సెస్ ట్రాక్ లో కోలీవుడ్ దర్శకులను నమ్ముకోవడం మంచిదే. వచ్చి అయిదేళ్ళు దాటినా ఇంకా బ్లాక్ బస్టర్ అందుకోలేక వెయిట్ చేస్తున్న అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్టే కానీ ఆశించిన పెద్ద రేంజ్ లో వెళ్ళలేదు కాబట్టి ఏజెంట్ విజయం చాలా కీలకం.
This post was last modified on October 18, 2022 8:13 am
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…