రెండేళ్ల కిందట మలయాళంలో బ్లాక్బస్టర్గా నిలిచిన అయ్యప్పనుం కోషీయుం సినిమా రీమేక్ హక్కులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీసేసుకుంది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. ఇక అప్పట్నుంచి ఈ సినిమా లీడ్ రోల్స్ కోసం నటీనటులతో పాటు ఎంపిక ప్రక్రియ మొదలైంది. కానీ ఈ విషయం ఎంతకీ తేలలేదు.
ఒరిజినల్లో పృథ్వీరాజ్ చేసిన పాత్రకు రానా దగ్గుబాటి త్వరగానే ఖాయం అయ్యాడు కానీ.. మరో పాత్రకు ఎవరనే విషయంలో సుదీర్ఘ కాలం సందిగ్ధత నడిచింది. నందమూరి బాలకృష్ణ, రవితేజ.. ఇలా చాలా పేర్లే వినిపించాయి. చివరికి ఆ స్థానంలోకి పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఆయన ఇమేజ్కు తగ్గట్లు కథాకథనాలు కూడా మారాయి. టైటిల్ కూడా పవన్ పాత్రను సూచించేలా భీమ్లా నాయక్ అని పెట్టారు. ఈ సినిమా పవన్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. కమర్షియల్గానూ సినిమా బాగానే ఆడింది.
ఐతే పవన్ కాకుండా బాలయ్య ఈ పాత్ర చేసి ఉంటే సినిమా ఎలా ఉండేదన్న ఊహ ఆసక్తి రేకెత్తించేదే. ఇప్పుడు ఆ చర్చే నడుస్తోంది. బాలయ్య హోస్ట్ చేసే అన్ స్టాపబుల్ షోకు అతిథిగా వచ్చిన భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీని బాలయ్య ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. భీమ్లా నాయక్ సినిమాకు ముందు ఎవరిని అడిగారు అని. ఈ ఎపిసోడ్ ప్రోమోలో నాగవంశీ స్పందన చూస్తే.. బాలయ్యను ఆ పాత్ర కోసం అడిగారని స్పష్టంగా తెలిసిపోయింది.
మరి పూర్తి వివరాలు ఎపిసోడ్ వచ్చినపుడే చూడాలి. మరి బాలయ్య ఎందుకు ఈ పాత్ర చేయలేదన్నది ఆసక్తికరం. మామూలుగా బాలయ్యకు రీమేక్ల పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. మరి ఆ కారణంతో నో అన్నాడా లేక తన ఇమేజ్కు ఆ పాత్ర సెట్టవ్వదని అనుకున్నాడా.. లేక ఖాళీ లేక ఈ సినిమా చేయలేదా? చూద్దాం ఏం సమాధానం వస్తుందో?
This post was last modified on October 16, 2022 8:00 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…