స్టార్ హీరోయిన్లు కెరీర్లో మంచి స్థితిలో ఉండగా తమ ప్రేమాయణాల గురించి బయటపెట్టరు. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నా.. దాని గురించి మీడియాలో వార్తలు వచ్చినా.. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే బుకాయిస్తుంటారు. లేదా నో కామెంట్ అని తప్పించుుకంటూ ఉంటారు.
రిలేషన్షిప్ గురించి ఒప్పేసుకుంటే, పెళ్లి ప్రణాళికల గురించి బయటపెడితే అది కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తారు. కానీ రకుల్ ప్రీత్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. వివిధ భాషల్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆమె బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో పడింది. దాని గురించి ఓపెన్గా ప్రకటన చేసింది. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇక అప్పట్నుంచి ఇద్దరూ స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ ఇబ్బందీ లేకుండా తిరిగేస్తున్నారు.
ఐతే మిగతా హీరోయిన్లకు భిన్నంగా ఇలా రిలేషన్షిప్ గురించి ఓపెన్ అవడానికి కారణమేంటో రకుల్ వెల్లడించింది. “కొందరు తమ ప్రేమను బయట పెట్టేందుకు వెనుకడుగు వేస్తుంటారు. కానీ నేను వారిలా పిరికిదాన్ని కాదు. సినిమాల్లో నటించినట్టుగా నిజ జీవితంలో నటించలేను. నిజాయితీగా ఉండాలనుకుంటాను. జీవితానికి ఓ తోడు కావాలి. జాకీ, నేను ఒకే అభిప్రాయంతో ఉన్నాం. భయం వల్ల కొందరు కొన్ని విషయాలు దాచి, పలు సమస్యల్లో చిక్కుకుంటారు. నాకు భయం లేదు. అందుకే నా ప్రేమను దాచిపెట్టలేదు” అని రకుల్ స్పష్టం చేసింది.
త్వరలోనే రకుల్, జాకీ పెళ్లి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రకుల్ నటించిన తాజా చిత్రం ‘డాక్టర్ జీ’ శుక్రవారమే రిలీజైంది. ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.ప్రస్తుతం రకుల్ ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రివాలి’, ‘అయలాన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on October 16, 2022 3:44 pm
రామాయణ టీజర్ మీద సోషల్ మీడియాలో ఎంత నెగటివిటీ నడుస్తుందో తెలిసిందే. విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ వాటి ప్రెజెంటేషన్, క్వాలిటీ…
మొన్న విడుదలైన రాకాస, బైకర్ రెండూ స్టడీగా ఉన్నాయి. అయితే వాటికొచ్చిన టాక్స్ తో పోల్చుకుంటే వసూళ్లు అంత వేగంగా…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హాట్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా వరకు సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు గ్లామర్…
టాలీవుడ్లో అడివి శేష్ది విచిత్రమైన ప్రయాణం. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కర్మ, కిస్ సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డ అతను..…
ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర…
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి…