స్టార్ హీరోయిన్లు కెరీర్లో మంచి స్థితిలో ఉండగా తమ ప్రేమాయణాల గురించి బయటపెట్టరు. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నా.. దాని గురించి మీడియాలో వార్తలు వచ్చినా.. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే బుకాయిస్తుంటారు. లేదా నో కామెంట్ అని తప్పించుుకంటూ ఉంటారు.
రిలేషన్షిప్ గురించి ఒప్పేసుకుంటే, పెళ్లి ప్రణాళికల గురించి బయటపెడితే అది కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తారు. కానీ రకుల్ ప్రీత్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. వివిధ భాషల్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆమె బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో పడింది. దాని గురించి ఓపెన్గా ప్రకటన చేసింది. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇక అప్పట్నుంచి ఇద్దరూ స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ ఇబ్బందీ లేకుండా తిరిగేస్తున్నారు.
ఐతే మిగతా హీరోయిన్లకు భిన్నంగా ఇలా రిలేషన్షిప్ గురించి ఓపెన్ అవడానికి కారణమేంటో రకుల్ వెల్లడించింది. “కొందరు తమ ప్రేమను బయట పెట్టేందుకు వెనుకడుగు వేస్తుంటారు. కానీ నేను వారిలా పిరికిదాన్ని కాదు. సినిమాల్లో నటించినట్టుగా నిజ జీవితంలో నటించలేను. నిజాయితీగా ఉండాలనుకుంటాను. జీవితానికి ఓ తోడు కావాలి. జాకీ, నేను ఒకే అభిప్రాయంతో ఉన్నాం. భయం వల్ల కొందరు కొన్ని విషయాలు దాచి, పలు సమస్యల్లో చిక్కుకుంటారు. నాకు భయం లేదు. అందుకే నా ప్రేమను దాచిపెట్టలేదు” అని రకుల్ స్పష్టం చేసింది.
త్వరలోనే రకుల్, జాకీ పెళ్లి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రకుల్ నటించిన తాజా చిత్రం ‘డాక్టర్ జీ’ శుక్రవారమే రిలీజైంది. ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.ప్రస్తుతం రకుల్ ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రివాలి’, ‘అయలాన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on October 16, 2022 3:44 pm
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…
భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…
వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…