Movie News

నెపోటిజం విమర్శలపై స్టార్ డాటర్ ఎదురు దాడి

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో నెపోటిజం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. బాలీవుడ్లో బడా ఫ్యామిలీల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది సోషల్ మీడియాలో. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి వాళ్లపై గట్టిగా సోషల్ మీడియా దాడి జరిగింది. ఐతే చాలా వరకు వీళ్లందరూ ఈ సమయంలో సంయమనం పాటిస్తే మంచిదన్న ఉద్దేశంతో సైలెంటుగా ఉండిపోయారు. ఐతే ఎంతకీ ఈ దాడి ఆగకపోవడంతో స్టార్ కిడ్స్ ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. విమర్శల్ని కాచుకునే.. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సోనమ్ కపూర్.. నెపోటిజం విమర్శలకు బదులిచ్చే ప్రయత్నం చేయగా, ఇప్పుడు మహేష్ భట్ తనయురాలు, ఒకప్పటి కథానాయిక పూజా భట్ లైన్లోకి వచ్చింది.

భట్ కుటుంబం మీద వచ్చే నెపోటిజం విమర్శలు చూస్తే తనకు నవ్వు వస్తోందని ఆమె వ్యాఖ్యానించింది. బాలీవుడ్లో అత్యధికంగా కొత్త వాళ్లకు, వర్ధమాన కళాకారులు, టెక్నీషియన్లకు అవకాశం కల్పించిన ఘనత భట్ సంస్థకే చెందుతుందని ఆమె అంది. పదుల సంఖ్యలో కొత్త వాళ్లను తమ సంస్థ పరిశ్రమకు పరిచయం చేసిందని ఆమె అంది. ఒక దశలో స్టార్లతో సినిమాలే చేయరని.. కొత్త వాళ్లకే అవకాశమిస్తూ పక్షపాతం చూపిస్తున్నారని తమ సంస్థ మీద విమర్శలు కూడా వచ్చాయని ఆమె గుర్తు చేసింది. ఇప్పుడు తమ కుటుంబంపై అదే పనిగా విమర్శలు చేస్తున్న కంగనా రనౌత్ గురించి కూడా పూజా స్పందించింది. ఇప్పుడిలా మాట్లాడుతున్న కంగనాను కూడా ‘గ్యాంగ్‌స్టర్’ సినిమా ద్వారా తమ సంస్థే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిందని ఆమె చెప్పింది. కంగనా గొప్ప ప్రతిభావంతురాలని.. ఆమెను కనుగొన్నది దర్శకుడు అనురాగ్ బసునే అయినప్పటికీ.. తనను నమ్మి తొలి అవకాశం ఇచ్చామని.. ఇప్పుడామె అదే పనిగా తమను టార్గెట్ చేయడమేంటని పూజా ప్రశ్నించింది.

This post was last modified on July 9, 2020 7:37 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

56 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

2 hours ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

3 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

4 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

5 hours ago