మొన్న దసరాకి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలు సందడి చేశాక ఈ వారం అంతకు మించి అనే స్థాయిలో ఏకంగా తొమ్మిది సినిమాలు థియేటర్లను పలకరించాయి. నెంబర్ అయితే ఘనంగా ఉంది కానీ నిన్న ఫ్రైడే సందడి ఎక్కడా కనిపించకపోవడం ట్రేడ్ ని నిరాశలో ముంచెత్తింది.
ఉన్నవాటిలో కాస్త ప్రమోషన్లు ఎక్కువగా చేసుకున్న ఆది సాయికుమార్ సిల్లీ ఫెలో, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ లకు కొద్దోగొప్పో జనం వచ్చారు కానీ మిగిలినవాటికి కనీసం థియేటర్ రెంట్లు గిట్టుబాటు అయ్యేంత కలెక్షన్ కూడా రాలేదు. కారణం దేనిమీదా కనీస స్థాయిలో అంచనాలు లేకపోవడమే. ప్రధాన కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి.
ఇక టాక్ గురించి చెప్పుకోకపోవడం ఉత్తమం. బాగానే ఉందని ఏదీ అనిపించుకోలేదు. అసలు స్టార్లు చేసిన యావరేజ్ కంటెంట్లే అంతంత మాత్రంగా ఆడుతుంటే ఎలాంటి ఆకర్షణలు లేని చిన్న బడ్జెట్ చిత్రాలకు టికెట్ కౌంటర్ల దగ్గర పబ్లిక్ ని ఆశించడం అత్యాశే.
ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ ఎప్పడూ చూడనిది ఏదో ఉందట అనిపించినా జనం కదులుతారు కానీ సోసో ఎంటర్ టైన్మెంట్ కి కాసులు రాలే కాలం కాదిది. అంతకు ముంచు డీసెంట్ రిపోర్ట్స్ తెచ్చుకున్న కృష్ణ వృందా విహారి సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో రాబట్టుకోలేక చేతులెత్తేయడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. బాగుందని చెప్పినా సరే స్వాతిముత్యంకు రాలేదు.
ఒక్క కాంతారా మీద మాత్రమే పాజిటివ్ బజ్ ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకీ అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత జోరుగా లేవు. ప్యూర్ కన్నడ నేటివిటీ కావడంతో మన ఆడియన్స్ ఇంకా పూర్తి స్థాయిలో దీనివైపు మొగ్గు చూపడం లేదు.
రివ్యూలు గట్రా ఎక్స్ ట్రాడినరీగా ఉన్నాయి. ప్రభాస్ ఏకంగా రెండుసార్లు చూశాడు. సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలు చాలా మంది ట్వీట్లు పెట్టారు. ఇంత పెద్ద అడ్వాంటేజ్ ని కాంతారా ఎలా వాడుకుంటుందో చూడాలి. హఠాత్తుగా సోమవారం నుంచి నెమ్మదించిన గాడ్ ఫాదర్ ఆశలు కూడా ఈ రెండు రోజుల వీకెండ్ మీదే ఉన్నాయి.
This post was last modified on October 15, 2022 1:52 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…