Movie News

ఆహా అనిపించిన అల్లు వ్యూహం

మాములుగా టీవీ ఛానల్స్ లోనే సెలబ్రిటీ టాక్ షోలు రొటీన్ అయిపోయాయి. మొదట్లో రానా, మంచు లక్ష్మి లాంటి వాళ్ళు నిర్వహించినప్పుడు జనం కొత్తగా ఫీలయ్యి చూశారు కానీ యూట్యూబ్ ఛానల్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి వాటిలోనూ లెక్కలేనన్ని ముఖాముఖీ కార్యక్రమాలు వచ్చాక ఇవి చూడటం తగ్గిపోయింది.

అలాంటిది డబ్బులు కట్టి చూసే ఓటిటిలో వీటిని మొదలుపెట్టడమంటే సాహసమే. అయినా ఆహా దానికి పూనుకుంది. మొదట్లో సమంతాతో సామ్ జామ్ అనే ప్రోగ్రాం చేశారు కానీ ఆది ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. చిరంజీవి, అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోలు వచ్చినా లాభం లేకపోయింది.

అదయ్యాక ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణను మొట్టమొదటిసారిగా యాంకర్ గా మార్చి చేసిన అన్ స్టాపబుల్ ప్రోగ్రాం అద్భుత ఫలితాలను ఇచ్చింది. మాములుగా మీడియా కెమెరా ముందు తడబడే బాలయ్యలోని రియల్ ఎనర్జీని ఇందులో చూసి అభిమానులు మురిసిపోతే సామాన్య ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

మొత్తానికి షో సూపర్ హిట్ అయ్యింది. సెకండ్ సీజన్ కి డిమాండ్ వచ్చింది. ఇక్కడే అల్లు టీమ్ తమ వ్యూహాన్ని గొప్పగా అమలు పరిచింది. కార్యక్రమం మొదలుపెట్టే టైంకి సినీ స్టార్లు అందుబాటులో లేకపోవడంతో తెలివిగా మాజీ సిఎం, టిడిపి అధినేత స్వయానా బాలకృష్ణ బావ చంద్రబాబునాయుడుని తీసుకొచ్చింది.

మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా బయట ఇలాంటి టాక్ షోకి బాబు హాజరు కావడం ఇదే మొదటిసారి. దెబ్బకు కేవలం ప్రోమోతోనే ఎక్కడి లేని బజ్ వచ్చేసింది. రాజకీయ ప్రతిపక్షాలు ఈ అయిదు నిముషాల కంటెంట్ కే ఊగిపోయారు. న్యూస్ ఛానళ్లు ఏకంగా డిబేట్లు పెట్టేశాయి.

నిన్న ఫుల్ ఎపిసోడ్ వచ్చాక కొన్ని చోట్ల ఫ్యాన్స్ తెరలు కట్టుకుని ప్రొజెక్షన్ ఏర్పాటు చేసుకుని మరీ చూశారు. ఇంత హైప్ రావడానికి రెండు కారణాలు. మొదటిది బాబు కాంబో, రెండోది పొలిటికల్ గా చాలా సున్నితమైన ఇష్యూస్ ని ఇందులో టచ్ చేయడం. మొత్తానికి పక్కా వ్యూహంతో ఆశించిన దానికన్నా గొప్ప రిజల్టే అందుకుని అల్లు బృందం ఆహా అనిపించుకుందిగా

This post was last modified on October 15, 2022 4:11 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

53 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

1 hour ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

1 hour ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

8 hours ago