ప్రభాస్ కొత్త సినిమా ఆదిపురుష్ టీజర్ చూసి మెచ్చిన వారి కంటే.. తీవ్ర నిరాశకు గురైన వాళ్లే ఎక్కువ. ఈ మధ్య కాలంలో ఈ టీజర్కు వచ్చినంత నెగెటివ్ రెస్పాన్స్ మరే సినిమా ప్రోమోకు రాలేదంటే అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇది యానిమేషన్ మూవీలా ఉండడం.. విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. రావణుడు, హనుమంతుడు పాత్రల విచిత్ర వేషధారణ.. ఇలా అనేక అభ్యంతరాలే వ్యక్తమయ్యాయి టీజర్ విషయంలో.
ఐతే సామాన్య ప్రేక్షకులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఈ టీజర్ విషయంలో నిరాశ చెందారనడానికి టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆదిపురుష్ టీజర్ చూసి తాను కూడా బాగా డిజప్పాయింట్ అయ్యానని.. మోసపోయిన భావన కలిగిందని మంచు విష్ణు చెప్పడం విశేషం. తన కొత్త చిత్రం జిన్నా ప్రమోషన్లలో భాగంగా అతనీ వ్యాఖ్యలు చేశాడు.
ఆదిపురుష్ టీజర్కు అంత నెగెటివ్ రెస్పాన్స్ రావడానికి.. అది యానిమేటెడ్ మూవీ అనే సంకేతాలు ఇవ్వకపోవడమే అని మంచు విష్ణు అభిప్రాయపడ్డాడు. రామాయణం మీద సినిమా, ప్రభాస్ హీరో అనగానే లైవ్ యాక్షన్ మూవీ అనే ఎవరైనా అనుకుంటారని, కానీ టీజర్ చూస్తే యానిమేటెడ్ సీన్లు కనిపించడం అందరూ డిజప్పాయింట్ అయ్యారని.. తనకు కూడా ఆదిపురుష్ టీం చేత మోసపోయిన ఫీలింగ్ కలిగిందని మంచు విష్ణు తెలిపాడు.
ఒక తెలుగువాడిగా తాను ఈ మాటలు చెబుతున్నానని.. ముందుగా ప్రేక్షకులను ప్రిపేర్ చేయకుండా ఇలా మోసం చేస్తే.. వారి స్పందన ఇలాగే ఉంటుందని విష్ణు అన్నాడు. ఇది యానిమేటెడ్ మూవీ అని ప్రమోట్ చేసి ఉంటే అసలు ట్రోల్స్ అనేవే ఉండేవి కావని విష్ణు చెప్పాడు. మరి విష్ణు లాంటి సెలబ్రెటీనే తనకు టీజర్ చూసి మోసపోయిన ఫీలింగ్ కలిగిందని అన్నాడంటే.. ఇక సామాన్య ప్రేక్షకుల స్పందన గురించి అర్థం చేసుకోవచ్చు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…