ప్రభాస్ కొత్త సినిమా ఆదిపురుష్ టీజర్ చూసి మెచ్చిన వారి కంటే.. తీవ్ర నిరాశకు గురైన వాళ్లే ఎక్కువ. ఈ మధ్య కాలంలో ఈ టీజర్కు వచ్చినంత నెగెటివ్ రెస్పాన్స్ మరే సినిమా ప్రోమోకు రాలేదంటే అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇది యానిమేషన్ మూవీలా ఉండడం.. విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. రావణుడు, హనుమంతుడు పాత్రల విచిత్ర వేషధారణ.. ఇలా అనేక అభ్యంతరాలే వ్యక్తమయ్యాయి టీజర్ విషయంలో.
ఐతే సామాన్య ప్రేక్షకులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఈ టీజర్ విషయంలో నిరాశ చెందారనడానికి టాలీవుడ్ హీరో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆదిపురుష్ టీజర్ చూసి తాను కూడా బాగా డిజప్పాయింట్ అయ్యానని.. మోసపోయిన భావన కలిగిందని మంచు విష్ణు చెప్పడం విశేషం. తన కొత్త చిత్రం జిన్నా ప్రమోషన్లలో భాగంగా అతనీ వ్యాఖ్యలు చేశాడు.
ఆదిపురుష్ టీజర్కు అంత నెగెటివ్ రెస్పాన్స్ రావడానికి.. అది యానిమేటెడ్ మూవీ అనే సంకేతాలు ఇవ్వకపోవడమే అని మంచు విష్ణు అభిప్రాయపడ్డాడు. రామాయణం మీద సినిమా, ప్రభాస్ హీరో అనగానే లైవ్ యాక్షన్ మూవీ అనే ఎవరైనా అనుకుంటారని, కానీ టీజర్ చూస్తే యానిమేటెడ్ సీన్లు కనిపించడం అందరూ డిజప్పాయింట్ అయ్యారని.. తనకు కూడా ఆదిపురుష్ టీం చేత మోసపోయిన ఫీలింగ్ కలిగిందని మంచు విష్ణు తెలిపాడు.
ఒక తెలుగువాడిగా తాను ఈ మాటలు చెబుతున్నానని.. ముందుగా ప్రేక్షకులను ప్రిపేర్ చేయకుండా ఇలా మోసం చేస్తే.. వారి స్పందన ఇలాగే ఉంటుందని విష్ణు అన్నాడు. ఇది యానిమేటెడ్ మూవీ అని ప్రమోట్ చేసి ఉంటే అసలు ట్రోల్స్ అనేవే ఉండేవి కావని విష్ణు చెప్పాడు. మరి విష్ణు లాంటి సెలబ్రెటీనే తనకు టీజర్ చూసి మోసపోయిన ఫీలింగ్ కలిగిందని అన్నాడంటే.. ఇక సామాన్య ప్రేక్షకుల స్పందన గురించి అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on October 15, 2022 7:18 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…