మెగాస్టార్ స్వయంగా మన ‘ఆటోజాని’ సినిమా ఎప్పుడంటూ లైవ్ లోనే దర్శకుడు పూరి జగన్ ను అడిగేయడంతో.. ఆ కథను ఆల్రెడీ ‘పైసా వసూల్’ అంటూ తీసేశా సార్ అని చెప్పాలేడు కాబట్టి, ఆ కతను పక్కనెట్టేశానండీ.. మీకోసం ఇంకోటి రాస్తున్నా అంటూ ఈ డ్యాషింగ్ డైరక్టర్ సెలవిచ్చాడు. దానితో ఇప్పుడు బోళా శంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాలు పూర్తవ్వగానే పూరి జగన్ తో మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేస్తాడంటూ టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వర్కవుట్ అవ్వాలంటే మాత్రం మన దర్శకుడు రెండు విషయాలను మానుకోవాలి.
పాయింట్ నెం1 ఏంటంటే.. అసలు కథ లేని కథలతో సినిమాలు తీయడం అనేది కష్టం అని పూరి జగన్ తెలుసుకోవాలి. లైగర్ సినిమాలో కూడా.. బడ్జెట్ ఉంది, గ్లామర్ ఉంది, మాంచి యాక్టర్లున్నారు.. కాని కథ మాత్రం లేదు. పాత చింతకాయ పచ్చడి స్టోరీలకు కొత్తతరం పంచులు కొన్ని రాసి తీసేస్తే సినిమాలు ఆడట్లేదు. అసలు కథ లేకపోతే మెగాస్టార్ సినిమాయే ఇవ్వరనుకోండి వేరే సంగతి, కాని ఒక్కోసారి చిరంజీవి కూడా పప్పులో కాలేస్తున్నారు కాబట్టి, కథ కరక్టుగా ఉందా లేదా అనే విషయం పూరీయే చూసుకోవాలి.
రెండోది ఏంటంటే.. పూరితో సినిమా అంటే ఈ మధ్య బడ్జెట్ లిమిట్ ఉండట్లేదట. ఆయన వాస్తవానికి సొంత ప్రొడక్షన్లే చేసుకుంటున్నాడు కాని, లైగర్ సినిమాకు కరణ్ జోహార్ ఇన్వెస్టర్ గా వచ్చాడు కాబట్టి నష్టాలు మినిమైజ్ అయ్యాయ్, లేకపోతే పూరి అండ్ ఛార్మి ఇద్దరూ చాలా క్రిటికల్ పొజిషన్లోకి స్లిప్పయిపోయేవారని ఇండస్ట్రీ టాక్. కంట్రోల్ లేకుండా సినిమాలు తీస్తున్నారని, ఒకప్పటిలా పూరి జగన్ అసలు రికార్డు టైములో సినిమాను పూర్తి చేయలేకపోతున్నాడటి టాక్. మరి మెగాస్టార్ తో సినిమా అంటే అలా డిలే చేయడం కుదరదు. ఆయన కూడా బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని పనిచేసే యాక్టర్. కాబట్టి డిసిప్లైన్ లేకుండా సినిమా తీయడం ఆయనతో కష్టమే.
ఏదేమైనా కూడా పూరి జగన్ తో సినిమా అనగానే వావ్ వావ్ అని అందరూ అంటున్నారు కాని, పూరి మాత్రం పైన రెండు చెప్పిన రెండు పాయింట్లు జాగ్రత్తగా చూసుకుని సినిమా చేస్తేనే ఆయన కెరియర్ కు ప్లస్సయ్యేది.
This post was last modified on October 14, 2022 2:52 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…