కొంతమంది హీరోలు ఒక టైప్ కంటెంట్ చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ చూసేస్తారు అని ఫిక్సయిపోయారు. ఓటిటిలో కంటెంట్ ఎక్కువగా చూస్తన్నారంటే అందుకు కారణం అక్కడున్న న్యుడిటీ, మితిమీరిన కిస్సింగ్ సీన్స్ అనుకుంటున్నారు. అందుకే హిట్లు లేక సతమతమవుతున్న చాలామంది హీరోలు ఇప్పుడు తమ సినిమాల్లో లిప్ కిస్ సీన్స్ అనేవి తెగ పెట్టేస్తున్నారు.
మొన్నామధ్యన డిజె టిల్లులో కూడా సిద్దూ జొన్నలగడ్డ ఇదే తరహాలో నేహా శెట్టితో పెదాలు పెనవేశాడు. దానితో కిరణ్ అబ్బవరం కూడా చాందిని చౌదరితో సమ్మతమే సినిమాలో అలాంటి ప్రయత్నమే చేశాడు. చివరకు రవితేజ కూడా పాటల్లో హీరోయిన్ల పెదాలను పెనవేస్తున్నాడు. ఖిలాడి అండ్ రామారావ్ ఆన్ డ్యూటిలో అవే చూపించాడు. కాని సినిమా రిజల్ట్ ఈ కిస్సింగ్ మీద ఆధారపడి ఉండదని సదరు సినిమాల రిజల్ట్ చూస్తే మనకూ అర్ధమవుతుంది.
హిట్ అనే పదానికి చాలాకాలం నుండి దూరంగా ఉంటున్న సందీప్ కిషన్ కూడా.. ‘మైఖేల్’ సినిమా కోసం దివ్యాన్ష కౌశిక్ కు ఒక ఘాటైన లిప్ కిస్ ఇచ్చేసి.. అదే పోస్టరుతో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. నిజానికి ఈ సుందరి ఏ ముహూర్తాన మజిలి సినిమాలో నాగచైతన్యతో లిప్ లాక్ చేసిందో కాని, ఆ తరువాత రామారావు ఆన్ డ్యూటి సినిమాలో రవితేజతో ఇప్పుడు మైఖేల్ కోసం సందీప్ తో అదే పని చేసింది. కాకపోతే పోస్టర్లోనే లిప్ లాక్ పోస్టర్ వేసి జనాలను ఎట్రాక్ట్ చేయడం అనేది చాలా పాత తరహా పద్దతి. ఇలాంటి పప్పులేమీ ఇప్పుడు ఆడియన్స్ దగ్గర్ వర్కవుట్ కావట్లేదు. కేవలం ఇలా కిస్సింగ్ ను నమ్ముకుంటే మాత్రం కష్టమే మాష్టారూ.
ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కూడా నట్టిస్తున్నారు కాబట్టి.. వారి వలన సినిమాకు మాంచి హైప్ వచ్చే ఛాన్సుంది. మేబి ట్రైలర్ రిలీజ్ గురించి ప్రకటించడానికి రిలీజ్ చేసిన పోస్టర్లో వాళ్ళను పెట్టుంటే బాగుండేదేమో.
This post was last modified on October 14, 2022 2:43 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…