దసరా పండక్కి ‘గాడ్ ఫాదర్’తో సందడి చేశాడు చిరు. దీని తర్వాత తెలుగు వారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి కూడా ఆయన సందడి ఉంటుందని ఇంతకుముందే ప్రకటన వచ్చింది. బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తున్న కొత్త చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చాలా ముందుగానే ప్రకటించారు.
ఐతే విడుదలకు ఇంకో మూడు నెలలే సమయం ఉండగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ ఏమీ తెలియట్లేదు. ఇప్పటిదాకా కనీసం టైటిల్ కూడా ప్రకటించకపోవడంతో సంక్రాంతికి ఈ చిత్రం రావడమే సందేహమే అంటున్నారు. రెండు మూడు రోజులుగా ఈ రకమైన ప్రచారం ఊపందుకుంటోంది. చిరు-బాబీ సినిమా వేసవికి వాయిదా అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఐతే వీటికి చిత్ర బృందం చెక్ పెట్టింది. సంక్రాంతికి తమ చిత్రం పక్కాగా వస్తుందనే విషయాన్ని శుక్రవారం చెప్పకనే చెప్పింది మెగా 154 టీం.
‘వాల్తేరు వీరయ్య’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న చిరు కొత్త చిత్రం అప్పుడే డబ్బింగ్ వర్క్లోకి దిగిపోయింది. శుక్రవారం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పని షురూ చేశాడు దర్శకుడు బాబీ. చిత్రీకరణ చివరి దశలో ఉంటే తప్ప డబ్బింగ్ పనులు మొదలు కావు. ఎప్పుడో వేసవిలో సినిమా రిలీజ్ చేసేట్లయితే ఇప్పుడే డబ్బింగ్ చెప్పించాల్సిన అవసరం లేదు. షూటింగ్ చివరి దశగా ఉండగా.. ముందు నుంచే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడితే తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో హడావుడి ఉండదని.. అన్నీ టైం ప్రకారం జరిగిపోతాయని భావించి ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఈ సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన చిరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో చిరు ఊర మాస్గా కనిపిస్తున్నాడు. మాస్ రాజా రవితేజ ఇందులో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. చిరు సరసన ఇందులో శ్రుతి హాసన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
This post was last modified on October 14, 2022 11:32 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…