పోయినేడాది ఈ టైంకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘మా’ ఎన్నికల గురించే చర్చంతా. సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎలక్షన్స్ విషయంలో రచ్చ రచ్చ జరిగింది. అనూహ్య మలుపులు తిరిగిన ఈ ఎన్నికల రణరంగంలో చివరికి మంచు విష్ణునే పైచేయి సాధించాడు. ప్రకాష్ రాజ్కు ఓటమి బాధ తప్పలేదు. ఎన్నికల తర్వాత కూడా కొన్ని అనూహ్య పరిణామాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది ‘మా’.
ఎన్నికలు జరిగిన తీరును నిరసిస్తూ ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ఆయన ప్యానెల్ నుంచి వివిధ పదవులకు పోటీ చేసి గెలిచిన వాళ్లు కూడా వాటికి రాజీనామా చేసేయడం తెలిసిందే. కొన్ని రోజులు వేచి చూశాక ప్రకాష్ రాజ్ ప్యానెల్ కోరుకున్నట్లే వారిని దూరంగా పెట్టేసింది మంచు విష్ణు వర్గం. ‘మా’ సభ్యత్వాన్ని వదులుకోవాలన్న ప్రకాష్ రాజ్ నిర్ణయంపై పునరాలోచించాలని అన్నారే తప్ప.. ఆయన సభ్యత్వం ఉందా లేదా అన్న విషయంలో క్లారిటీ లేకుండానే ఈ వ్యవహారం చల్లబడిపోయింది.
కాగా ‘మా’ అధ్యక్షుడిగా ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తన విజయాలతో పాటు వివిధ అంశాలపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మంచు విష్ణు.. కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించాడు. ‘మా’ సభ్యత్వం ఉన్న వాళ్లే తెలుగు సినిమాల్లో నటించేలా నిర్మాతలకు సూచించినట్లు వెల్లడించాడు. అలాగే ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా తెలిపాడు. ‘మా’కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా పోటీకి అనర్హులవుతారని.. అలాగే ‘మా’కు వ్యతిరేకంగా ధర్నాలు చేసినా, మీడియాకు ఎక్కినా వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తామని కూడా ప్రకటించాడు.
ఈ నిర్ణయాలన్నీ చూస్తుంటే.. ప్రకాష్ రాజ్ మళ్లీ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్రేక్ వేసే వ్యూహం లాగా కనిపిస్తోంది. ఆయన నిజంగా సభ్యత్వాన్ని వదులుకుని ఉంటే మళ్లీ ఎన్నికల సమయానికి వచ్చి పోటీకి సై అంటే కుదరదు అనేలాగా ‘మా’ మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే ‘మా’కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా అనర్హులవుతారని అనడం.. మధ్యలో ప్రకాష్ రాజ్ సహా ఎవ్వరూ నోరెత్తకుండా చేయడమే అంటున్నారు. ఈ పరిణామాలపై ప్రకాష్ రాజ్, ఆయన మద్దతుదారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on October 14, 2022 11:28 am
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…