న్యాచురల్ స్టార్ నానికి బ్యాడ్ టైం నడుస్తోంది. కథల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఫలితాలు మాత్రం ప్రతికూలంగా వస్తున్నాయి. వెండితెర మీదే కాదు బుల్లితెరపై కూడా ట్విస్టులు తప్పడం లేదు. తాజాగా అంటే సుందరానికి వరల్డ్ టీవీ ప్రీమియర్ కు కేవలం 1.88 టిఆర్పి రావడం పట్ల శాటిలైట్ ఛానల్ వర్గాలు షాక్ తిన్నాయి. ఇమేజ్ ఉన్న హీరోకి ఇంత తక్కువ నెంబర్ నమోదు కావడం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్టు. డిజాస్టర్ అయినా సరే టీవీలో మొదటిసారి టెలికాస్ట్ జరిగినప్పుడు జనం బాగానే చూస్తారు. కానీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రచారం జరిగిన అంటే సుందరానికి ఇలా జరగడం ట్విస్టే.
ఇదే కాదు నాని ట్రాక్ రికార్డు గత కొంతకాలంగా ఇలాగే నడుస్తోంది. ఎంతో కష్టపడి నెగటివ్ టచ్ ఉన్నవి చేస్తే అది ఓటిటిలో వచ్చినా విమర్శలు అందుకుంది. ప్రెస్ మీట్లలో మిలియన్ల వ్యూస్ వచ్చాయని చెప్పుకోవచ్చు కానీ ఆ సినిమా బాగుందన్న ఆడియన్స్ ఎక్కడా కనిపించరు. తన రెగ్యులర్ స్కూల్ కు వచ్చి చేసిన టక్ జగదీష్ సైతం అదే ఫలితాన్ని అందుకుంది. శ్యామ్ సింగ రాయ్ ఒక్కటే ఊరట కలిగించేలా మంచి విజయం అందుకుంది. పుష్ప హవాలోనూ తట్టుకుని నిలబడింది. దానికి కూడా నాని చాలా పెద్ద రేంజ్ ఫలితాన్ని ఆశించాడు. హిట్టే కానీ బ్లాక్ బస్టర్ కాలేకపోవడమే కారణం.
కట్ చేస్తే ఇప్పుడీ అంటే సుందరానికి ఇలాంటి ఝలక్. అందుకే కంప్లీట్ మేకోవర్ తో ఊర మాస్ అవతారంలోకి వెళ్లి చేస్తున్న దసరా మీదే నాని ఫ్యాన్స్ ఆశలన్నీ. ఇటీవలే రిలీజ్ చేసిన ఆడియో సింగల్ ఛార్ట్ బస్టర్ అయ్యింది. థియేట్రికల్ బిజినెస్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. బడ్జెట్ ఎక్కువవుతున్నా నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. శాటిలైట్, ఓటిటి, డబ్బింగ్ హక్కులకు డిమాండ్ ఉండటంతో టేబుల్ ప్రాఫిట్స్ ఖాయంగానే కనిపిస్తున్నాయి. తన కంఫర్ట్ జానర్ నుంచి బయటికి వచ్చి నాని చేస్తున్న ఈ ప్రయత్నం కనక వర్కౌట్ అయితే మార్కెట్ విస్తరించే అవకాశం పుష్కలంగా ఉంది.
This post was last modified on October 13, 2022 8:07 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…