బాలీవుడ్ ని శాసించే నిర్మాతలలో ఒకడైన కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్ కూడా అతడిని ఎఫెక్ట్ చేయవు. చాలా జోవియల్ గా ఉండే కరణ్ ఇటీవల సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాక సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అయిపోయాడు.
సుశాంత్ మరణానికి తనే కారణం అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పాటు… నువ్వు కూడా అతడిలా చనిపోవాలంటూ కొందరు ట్వీట్స్ పెట్టడంతో కరణ్ తీవ్రంగా కలత చెందాడట. సుశాంత్ మరణించిన దగ్గర్నుంచీ కరణ్ ఏడుస్తూనే ఉన్నాడని అతని సన్నిహితుడు ఒకరు మీడియాకు చెప్పాడు. కరణ్ ఎందుకు స్పందించడం లేదంటే… ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండడమే ఉత్తమం అని లాయర్ సూచించడంతో కరణ్ మాట్లాడ్డం లేదట.
అసలు సుశాంత్ మరణంతో సంబంధం లేని చాలా మందిని సోషల్ మీడియా టార్గెట్ చేస్తోందని, అకారణంగా ఆలియా భట్, అనన్య పాండే, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా తదితరులు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అతను అన్నాడు. సుశాంత్ మరణానికి కారణం తెలియకపోయినా కానీ… బాలీవుడ్ లో వేళ్ళూనుకుపోయిన బంధు ప్రీతి అతడిని చంపేసిందని, కనుక సినీ వారసులంతా అతని మరణానికి బాధ్యులే అనేది సుశాంత్ ఫాన్స్ ఆరోపణ.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…