బాలీవుడ్ ని శాసించే నిర్మాతలలో ఒకడైన కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్ కూడా అతడిని ఎఫెక్ట్ చేయవు. చాలా జోవియల్ గా ఉండే కరణ్ ఇటీవల సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాక సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అయిపోయాడు.
సుశాంత్ మరణానికి తనే కారణం అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పాటు… నువ్వు కూడా అతడిలా చనిపోవాలంటూ కొందరు ట్వీట్స్ పెట్టడంతో కరణ్ తీవ్రంగా కలత చెందాడట. సుశాంత్ మరణించిన దగ్గర్నుంచీ కరణ్ ఏడుస్తూనే ఉన్నాడని అతని సన్నిహితుడు ఒకరు మీడియాకు చెప్పాడు. కరణ్ ఎందుకు స్పందించడం లేదంటే… ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండడమే ఉత్తమం అని లాయర్ సూచించడంతో కరణ్ మాట్లాడ్డం లేదట.
అసలు సుశాంత్ మరణంతో సంబంధం లేని చాలా మందిని సోషల్ మీడియా టార్గెట్ చేస్తోందని, అకారణంగా ఆలియా భట్, అనన్య పాండే, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా తదితరులు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అతను అన్నాడు. సుశాంత్ మరణానికి కారణం తెలియకపోయినా కానీ… బాలీవుడ్ లో వేళ్ళూనుకుపోయిన బంధు ప్రీతి అతడిని చంపేసిందని, కనుక సినీ వారసులంతా అతని మరణానికి బాధ్యులే అనేది సుశాంత్ ఫాన్స్ ఆరోపణ.
This post was last modified on July 9, 2020 7:07 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…