బాలీవుడ్ ని శాసించే నిర్మాతలలో ఒకడైన కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్ కూడా అతడిని ఎఫెక్ట్ చేయవు. చాలా జోవియల్ గా ఉండే కరణ్ ఇటీవల సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాక సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అయిపోయాడు.
సుశాంత్ మరణానికి తనే కారణం అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పాటు… నువ్వు కూడా అతడిలా చనిపోవాలంటూ కొందరు ట్వీట్స్ పెట్టడంతో కరణ్ తీవ్రంగా కలత చెందాడట. సుశాంత్ మరణించిన దగ్గర్నుంచీ కరణ్ ఏడుస్తూనే ఉన్నాడని అతని సన్నిహితుడు ఒకరు మీడియాకు చెప్పాడు. కరణ్ ఎందుకు స్పందించడం లేదంటే… ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండడమే ఉత్తమం అని లాయర్ సూచించడంతో కరణ్ మాట్లాడ్డం లేదట.
అసలు సుశాంత్ మరణంతో సంబంధం లేని చాలా మందిని సోషల్ మీడియా టార్గెట్ చేస్తోందని, అకారణంగా ఆలియా భట్, అనన్య పాండే, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా తదితరులు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అతను అన్నాడు. సుశాంత్ మరణానికి కారణం తెలియకపోయినా కానీ… బాలీవుడ్ లో వేళ్ళూనుకుపోయిన బంధు ప్రీతి అతడిని చంపేసిందని, కనుక సినీ వారసులంతా అతని మరణానికి బాధ్యులే అనేది సుశాంత్ ఫాన్స్ ఆరోపణ.
This post was last modified on July 9, 2020 7:07 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…