బాలీవుడ్ ని శాసించే నిర్మాతలలో ఒకడైన కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్ కూడా అతడిని ఎఫెక్ట్ చేయవు. చాలా జోవియల్ గా ఉండే కరణ్ ఇటీవల సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాక సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అయిపోయాడు.
సుశాంత్ మరణానికి తనే కారణం అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పాటు… నువ్వు కూడా అతడిలా చనిపోవాలంటూ కొందరు ట్వీట్స్ పెట్టడంతో కరణ్ తీవ్రంగా కలత చెందాడట. సుశాంత్ మరణించిన దగ్గర్నుంచీ కరణ్ ఏడుస్తూనే ఉన్నాడని అతని సన్నిహితుడు ఒకరు మీడియాకు చెప్పాడు. కరణ్ ఎందుకు స్పందించడం లేదంటే… ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండడమే ఉత్తమం అని లాయర్ సూచించడంతో కరణ్ మాట్లాడ్డం లేదట.
అసలు సుశాంత్ మరణంతో సంబంధం లేని చాలా మందిని సోషల్ మీడియా టార్గెట్ చేస్తోందని, అకారణంగా ఆలియా భట్, అనన్య పాండే, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా తదితరులు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అతను అన్నాడు. సుశాంత్ మరణానికి కారణం తెలియకపోయినా కానీ… బాలీవుడ్ లో వేళ్ళూనుకుపోయిన బంధు ప్రీతి అతడిని చంపేసిందని, కనుక సినీ వారసులంతా అతని మరణానికి బాధ్యులే అనేది సుశాంత్ ఫాన్స్ ఆరోపణ.
This post was last modified on July 9, 2020 7:07 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…