కొత్త సినిమాలు రిలీజై మంచి విజయం అందుకున్నాక దర్శకులకు నిర్మాతలు కార్లను గిఫ్టుగా ఇవ్వడం మామూలే. ఇందుకు టాలీవుడ్లో చాలా ఉదాహరణలే ఉన్నాయి. దీన్నొక ప్రమోషన్గా ఉపయోగించుకోవడం కూడా చూస్తుంటాం. ఐతే సినిమా రిలీజ్ కంటే ముందే దర్శకుడికి నిర్మాతలు కారు బహుమతిగా ఇవ్వడం మాత్రం అరుదుగానే జరుగుతుంటుంది. అందులోనూ ఒక చిన్న హీరోను పెట్టి తీసిన చిన్న చిత్రానికి దర్శకుడు కారును బహుమతిగా అందుకోవడం విశేషమే.
‘హృదయ కాలేయం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత కొబ్బరిమట్ట, కలర్ ఫొటో చిత్రాలను నిర్మించిన సాయి రాజేష్ జఈ జాబితాలో చేరాడు. అతను దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ‘బేబీ’ ఔట్ పుట్ చూసి ఫిదా అయిపోయిన నిర్మాత ఎస్కేఎన్, సమర్పకుడు మారుతి కలిసి.. ఎంజీ హెక్టార్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర రూ.15 లక్షలు కావడం విశేషం.
ఈ సినిమా రేంజికి ఇది దర్శకుడికి దక్కిన పెద్ద బహుమతిగానే భావించాలి. ‘బేబీ’ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రమిది. సాయి రాజేష్ కథ అందించిన ‘కలర్ ఫొటో’ ఆహాలో రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాక.. జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకోవడంతో ‘బేబీ’ మీద అంచనాలు పెరిగాయి.
‘కలర్ ఫొటో’లో మాదిరే ఇందులోనూ కథాంశం హార్డ్ హిట్టింగ్గా ఉంటుందని అంటున్నారు. ‘బేబీ’కి ఆల్రెడీ మంచి బజ్ ఉండగా.. హైప్ ఇంకా పెంచే ఉద్దేశంతో కూడా ఇలా దర్శకుడికి కారును బహుమతిగా ఇచ్చి ఉండొచ్చు. త్వరలోనే ‘బేబీ’ టీజర్ లాంచ్ కాబోతోంది. అది చూస్తే సినిమా సత్తా ఎంత అన్నది ఒక అవగాహన వచ్చేస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on October 13, 2022 12:14 pm
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…