కొత్త సినిమాలు రిలీజై మంచి విజయం అందుకున్నాక దర్శకులకు నిర్మాతలు కార్లను గిఫ్టుగా ఇవ్వడం మామూలే. ఇందుకు టాలీవుడ్లో చాలా ఉదాహరణలే ఉన్నాయి. దీన్నొక ప్రమోషన్గా ఉపయోగించుకోవడం కూడా చూస్తుంటాం. ఐతే సినిమా రిలీజ్ కంటే ముందే దర్శకుడికి నిర్మాతలు కారు బహుమతిగా ఇవ్వడం మాత్రం అరుదుగానే జరుగుతుంటుంది. అందులోనూ ఒక చిన్న హీరోను పెట్టి తీసిన చిన్న చిత్రానికి దర్శకుడు కారును బహుమతిగా అందుకోవడం విశేషమే.
‘హృదయ కాలేయం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత కొబ్బరిమట్ట, కలర్ ఫొటో చిత్రాలను నిర్మించిన సాయి రాజేష్ జఈ జాబితాలో చేరాడు. అతను దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ‘బేబీ’ ఔట్ పుట్ చూసి ఫిదా అయిపోయిన నిర్మాత ఎస్కేఎన్, సమర్పకుడు మారుతి కలిసి.. ఎంజీ హెక్టార్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర రూ.15 లక్షలు కావడం విశేషం.
ఈ సినిమా రేంజికి ఇది దర్శకుడికి దక్కిన పెద్ద బహుమతిగానే భావించాలి. ‘బేబీ’ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రమిది. సాయి రాజేష్ కథ అందించిన ‘కలర్ ఫొటో’ ఆహాలో రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాక.. జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకోవడంతో ‘బేబీ’ మీద అంచనాలు పెరిగాయి.
‘కలర్ ఫొటో’లో మాదిరే ఇందులోనూ కథాంశం హార్డ్ హిట్టింగ్గా ఉంటుందని అంటున్నారు. ‘బేబీ’కి ఆల్రెడీ మంచి బజ్ ఉండగా.. హైప్ ఇంకా పెంచే ఉద్దేశంతో కూడా ఇలా దర్శకుడికి కారును బహుమతిగా ఇచ్చి ఉండొచ్చు. త్వరలోనే ‘బేబీ’ టీజర్ లాంచ్ కాబోతోంది. అది చూస్తే సినిమా సత్తా ఎంత అన్నది ఒక అవగాహన వచ్చేస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on October 13, 2022 12:14 pm
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…