Movie News

హాలిడేకి వెళ్లొచ్చినా రష్మిక అదే పాట పాడింది

మాల్డీవ్స్ లో తన ఐదు రోజుల హాలిడే ముగించుకుని తిరిగొచ్చింది రష్మిక మందన్న. తన స్నేహితుడు విజయ్ దేవరకొండతో కలసి ఆమె ఐదురోజుల పాటు ఒక బీచ్ రీసార్ట్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వెళ్లే ముందు తను విజయ్ కేవలం స్నేహితులమే అని చెప్పిన ఈ కన్నడ సుందరి, ఇప్పుడు తిరిగొచ్చేటప్పుడు కూడా ఎయిర్ పోర్టులో పోటోగ్రాఫర్లతో అదే పాట పడింది. కలసి ఒక ఫోటో దిగండి అంటే మాత్రం, మేం జస్ట్ ఫ్రెండ్స్ అనేసింది. ఇప్పుడు దీని గురించే బాలీవుడ్లో కూడా చర్చలు జరుగుతున్నాయ్.

నిజానికి బాలీవుడ్లో చాలామంది లవ్ బర్డ్స్ ప్రేమలో ఉన్నప్పుడు ఒప్పేసుకుంటారు, బ్రేకప్ అయిన తరువాత హానెస్ట్ గా మ్యాటర్ చెప్పేసుకుంటారు. కాని మన దగ్గర మాత్రం పెళ్ళికి వారంరోజుల ముందు వరకు కూడా సమంత అండ్ నాగ్ చైతన్య కూడా తాము కేవలం స్నేహితులమనే చెప్పారు. ఇప్పుడు రష్మిక కూడా బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నా కూడా మేం జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని చెబుతుంటే ఎవ్వరికీ కిక్ రావట్లేదు.

వీళ్ళు కేవలం స్నేహితులు కాదు, గాళ్‌ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అంటూ కరణ్‌ జోహార్ ‘కాఫీ విత్ కరణ్‌’ ప్రోగ్రాములో పాల్గొన్న ఝాన్వి కపూర్, సారా ఆలీ ఖాన్.. అప్పట్లో చెప్పకనే చెప్పారులే. ఆల్రెడీ విజయ్ కు గాళ్ ఫ్రెండ్ ఉందంటూ కరణ్‌ జోహార్ కూడా చాలాసార్లు హింట్లు ఇచ్చేశాడు. పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుని లోకం చీకటిగా ఉందన్నట్లు.. వీళ్లు ఎంతసేపూ మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటే మన దగ్గర అందరూ నమ్మేసినా కూడా బాలీవుడ్లో నమ్మట్లేదు.

ఒకవేళ నిజంగానే ఫ్రెండ్స్ అయితే మాల్డీవ్స్ నుండి కనీసం కలసి ఒక్క పిక్ కూడా షేర్ చెయ్యరా అంటూ అందరూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక బాలీవుడ్లో అయితే ఇద్దరూ కలసి ఒకేసారి.. షార్ట్ గ్యాపులో లైగర్ అండ్ గుడ్ బాయ్ అంటూ ఫ్లాపులను చవిచూసి.. కలసి మాల్డీవ్స్ ఫ్లయిట్ ఎక్కేసి.. ఒక మలైకా అరోరా అండ్ అర్జున్ కపూర్ తరహాలో రచ్చ చేస్తున్నారంటూ అక్కడి మీడియా ఇప్పుడు వీళ్లపై విరుచుకుపడుతోంది. ఏదేమైనా కూడా రష్మిక పాట జనాలకు నచ్చలేదని తెలుస్తోంది.

This post was last modified on October 13, 2022 11:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

2 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

2 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

14 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago