మాల్డీవ్స్ లో తన ఐదు రోజుల హాలిడే ముగించుకుని తిరిగొచ్చింది రష్మిక మందన్న. తన స్నేహితుడు విజయ్ దేవరకొండతో కలసి ఆమె ఐదురోజుల పాటు ఒక బీచ్ రీసార్ట్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వెళ్లే ముందు తను విజయ్ కేవలం స్నేహితులమే అని చెప్పిన ఈ కన్నడ సుందరి, ఇప్పుడు తిరిగొచ్చేటప్పుడు కూడా ఎయిర్ పోర్టులో పోటోగ్రాఫర్లతో అదే పాట పడింది. కలసి ఒక ఫోటో దిగండి అంటే మాత్రం, మేం జస్ట్ ఫ్రెండ్స్ అనేసింది. ఇప్పుడు దీని గురించే బాలీవుడ్లో కూడా చర్చలు జరుగుతున్నాయ్.
నిజానికి బాలీవుడ్లో చాలామంది లవ్ బర్డ్స్ ప్రేమలో ఉన్నప్పుడు ఒప్పేసుకుంటారు, బ్రేకప్ అయిన తరువాత హానెస్ట్ గా మ్యాటర్ చెప్పేసుకుంటారు. కాని మన దగ్గర మాత్రం పెళ్ళికి వారంరోజుల ముందు వరకు కూడా సమంత అండ్ నాగ్ చైతన్య కూడా తాము కేవలం స్నేహితులమనే చెప్పారు. ఇప్పుడు రష్మిక కూడా బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నా కూడా మేం జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని చెబుతుంటే ఎవ్వరికీ కిక్ రావట్లేదు.
వీళ్ళు కేవలం స్నేహితులు కాదు, గాళ్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అంటూ కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాములో పాల్గొన్న ఝాన్వి కపూర్, సారా ఆలీ ఖాన్.. అప్పట్లో చెప్పకనే చెప్పారులే. ఆల్రెడీ విజయ్ కు గాళ్ ఫ్రెండ్ ఉందంటూ కరణ్ జోహార్ కూడా చాలాసార్లు హింట్లు ఇచ్చేశాడు. పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుని లోకం చీకటిగా ఉందన్నట్లు.. వీళ్లు ఎంతసేపూ మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటే మన దగ్గర అందరూ నమ్మేసినా కూడా బాలీవుడ్లో నమ్మట్లేదు.
ఒకవేళ నిజంగానే ఫ్రెండ్స్ అయితే మాల్డీవ్స్ నుండి కనీసం కలసి ఒక్క పిక్ కూడా షేర్ చెయ్యరా అంటూ అందరూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక బాలీవుడ్లో అయితే ఇద్దరూ కలసి ఒకేసారి.. షార్ట్ గ్యాపులో లైగర్ అండ్ గుడ్ బాయ్ అంటూ ఫ్లాపులను చవిచూసి.. కలసి మాల్డీవ్స్ ఫ్లయిట్ ఎక్కేసి.. ఒక మలైకా అరోరా అండ్ అర్జున్ కపూర్ తరహాలో రచ్చ చేస్తున్నారంటూ అక్కడి మీడియా ఇప్పుడు వీళ్లపై విరుచుకుపడుతోంది. ఏదేమైనా కూడా రష్మిక పాట జనాలకు నచ్చలేదని తెలుస్తోంది.
This post was last modified on October 13, 2022 11:25 am
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…