మాల్డీవ్స్ లో తన ఐదు రోజుల హాలిడే ముగించుకుని తిరిగొచ్చింది రష్మిక మందన్న. తన స్నేహితుడు విజయ్ దేవరకొండతో కలసి ఆమె ఐదురోజుల పాటు ఒక బీచ్ రీసార్ట్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వెళ్లే ముందు తను విజయ్ కేవలం స్నేహితులమే అని చెప్పిన ఈ కన్నడ సుందరి, ఇప్పుడు తిరిగొచ్చేటప్పుడు కూడా ఎయిర్ పోర్టులో పోటోగ్రాఫర్లతో అదే పాట పడింది. కలసి ఒక ఫోటో దిగండి అంటే మాత్రం, మేం జస్ట్ ఫ్రెండ్స్ అనేసింది. ఇప్పుడు దీని గురించే బాలీవుడ్లో కూడా చర్చలు జరుగుతున్నాయ్.
నిజానికి బాలీవుడ్లో చాలామంది లవ్ బర్డ్స్ ప్రేమలో ఉన్నప్పుడు ఒప్పేసుకుంటారు, బ్రేకప్ అయిన తరువాత హానెస్ట్ గా మ్యాటర్ చెప్పేసుకుంటారు. కాని మన దగ్గర మాత్రం పెళ్ళికి వారంరోజుల ముందు వరకు కూడా సమంత అండ్ నాగ్ చైతన్య కూడా తాము కేవలం స్నేహితులమనే చెప్పారు. ఇప్పుడు రష్మిక కూడా బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నా కూడా మేం జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని చెబుతుంటే ఎవ్వరికీ కిక్ రావట్లేదు.
వీళ్ళు కేవలం స్నేహితులు కాదు, గాళ్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అంటూ కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాములో పాల్గొన్న ఝాన్వి కపూర్, సారా ఆలీ ఖాన్.. అప్పట్లో చెప్పకనే చెప్పారులే. ఆల్రెడీ విజయ్ కు గాళ్ ఫ్రెండ్ ఉందంటూ కరణ్ జోహార్ కూడా చాలాసార్లు హింట్లు ఇచ్చేశాడు. పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుని లోకం చీకటిగా ఉందన్నట్లు.. వీళ్లు ఎంతసేపూ మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటే మన దగ్గర అందరూ నమ్మేసినా కూడా బాలీవుడ్లో నమ్మట్లేదు.
ఒకవేళ నిజంగానే ఫ్రెండ్స్ అయితే మాల్డీవ్స్ నుండి కనీసం కలసి ఒక్క పిక్ కూడా షేర్ చెయ్యరా అంటూ అందరూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక బాలీవుడ్లో అయితే ఇద్దరూ కలసి ఒకేసారి.. షార్ట్ గ్యాపులో లైగర్ అండ్ గుడ్ బాయ్ అంటూ ఫ్లాపులను చవిచూసి.. కలసి మాల్డీవ్స్ ఫ్లయిట్ ఎక్కేసి.. ఒక మలైకా అరోరా అండ్ అర్జున్ కపూర్ తరహాలో రచ్చ చేస్తున్నారంటూ అక్కడి మీడియా ఇప్పుడు వీళ్లపై విరుచుకుపడుతోంది. ఏదేమైనా కూడా రష్మిక పాట జనాలకు నచ్చలేదని తెలుస్తోంది.
This post was last modified on October 13, 2022 11:25 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…