టాలీవుడ్లో ఎవరిని అడిగినా అల్లు అరవింద్ అంత తెలివైన నిర్మాత మరొకరు లేరు అనే అంటారు. ఆయనంత తెలివైన వాడు కాబట్టే తన తరం నిర్మాతలందరూ ఎప్పుడో దుకాణం కట్టేసినా.. తను మాత్రం ఇప్పటికీ యాక్టివ్గా ఉంటూ విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతున్నారు.
ట్రెండ్ మారుతున్న విషయాన్ని గమనించి ‘ఆహా’ ఓటీటీని మొదలుపెట్టి దాన్ని మంచి స్థాయికి తీసుకెళ్లారు. ఐతే ఈ తెలివితేటలు ఈనాటివి కావని.. యుక్త వయసులో ఉండగానే తన టాలెంట్ చూపించానని, తన తెలివికి చిన్నప్ప దేవర్ అనే ఒకప్పటి టాప్ ప్రొడ్యూసర్ కూడా షాకైపోయారని ఆయన ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు.
మీరు తెలివైన వారని మీ నాన్న గుర్తించారా.. ఎప్పుడైనా ఆ మాట మీతో చెప్పారా అని ఆలీ.. అరవింద్ను అడగ్గా.. నేరుగా చెప్పలేదు కానీ, ఆయనకు నా తెలివితేటల మీద గురి ఉండేదని అరవింద్ వ్యాఖ్యానించారు.
తాను యుక్త వయసులో ఉండగానే ఏ విషయమైనా తనతో చెప్పి సలహా అడిగేవారని, దాన్ని బట్టే తన మీద ఆయనకున్న నమ్మకం అర్థమయ్యేదని అరవింద్ చెప్పారు. ఇక చిన్నప్ప దేవర్తో జరిగిన ఇన్సిడెంట్ గురించి గుర్తు చేసుుకంటూ… ‘‘ఒకసారి నాన్న గారు నాకు ఫోన్ చేసి చిన్నప్ప దేవర్ నిన్ను కలవాలంటున్నారు. వెంటనే రా అని చెప్పారు. కారు పంపిస్తే వెంటనే ఆయన దగ్గరికి వెళ్లా. నేను భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్తే.. ఆయన మా ఇద్దరి తగువు భలే తీర్చావురా అంటూ అభినందించారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఓ సినిమాకు గాను ఆయన నాన్న గారికి 12 వేల రూపాయల పారితోషకం ఇవ్వాలనుకున్నారు. కానీ నాన్న గారు 15 వేలుకే చేయాలనుకున్నారు. కానీ ఆయన మాత్రం సింగిల్ పేమెంట్ 12 వేలు ఇస్తా. తీసుకుని సినిమా చెయ్యి అన్నారు. ఈ విషయాన్ని నాన్న ముందు రోజు నాకు చెబితే.. 12 వేలు ఆయనకు ఇచ్చేసి, సినిమా అయ్యాక దానికి వడ్డీ కలిపి ఇవ్వమని చెప్పు అని సలహా ఇచ్చా. వడ్డీ కలిపితే ఆటోమేటిగ్గా 15 వేలు అవుతుంది. అప్పుడు ఆయనకు, నీకు ఇద్దరికీ నష్టం ఉండదు అని చెప్పా. ఈ విషయం అలాగే వెళ్లి నాన్న ఆయనకు చెప్పారు. ఆయనకు మైండ్ బ్లాంక్ అయిపోయి వెంటనే నన్ను పిలిపించి నావి గొప్ప తెలివితేటలంటూ అభినందించారు’’ అని అరవింద్ చెప్పారు.
This post was last modified on October 12, 2022 9:58 pm
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…