కృతి శెట్టి.. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లోకి ఉప్పెనలా దూసుకొచ్చిన అమ్మాయి కృతి శెట్టి. నిజానిని ఆ సినిమాలో వేరే హీరోయిన్ లీడ్ రోల్ చేయాల్సింది. ప్రారంభోత్సవంలో పాల్గొంది కూడా ఆ అమ్మాయే. కానీ తను ఈ చిత్రానికి సెట్టవ్వదని భావించి, తర్వాత ఆమె తప్పించి కృతిని ఎంచుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.
‘ఉప్పెన’ ఎంత పెద్ద హిట్టయిందో, కృతికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో వరుసగా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ‘ఉప్పెన రిలీజై రెండేళ్లు తిరక్కుండానే ఐదు సినిమాలు రిలీజయ్యాయి కృతివి.
అందులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు బాగానే ఆడాయి కానీ.. ఇటీవల వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది కృతి. రెండు నెలల వ్యవధిలో ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలతో షాక్ల మీద షాక్లు తింది ఈ అమ్మాయి. ఈ చిత్రాల్లో ఆమె అప్పీయరెన్స్, నటన విషయంలో విమర్శలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో కృతి కెరీర్ ఏమవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఐతే తెలుగులో కృతికి కొత్తగా సినిమా అవకాశాలేమీ వస్తున్నట్లు కనిపించడం లేదు కానీ.. ఆమె నెమ్మదిగా వేరే భాషల్లో బిజీ అవుతోంది. ఆల్రెడీ తమిళంలో రెండు సినిమాలు కమిటైంది కృతి. అందులో ఒకటి అక్కినేని నాగచైతన్యతో వెంకట్ ప్రభు రూపొందించబోయే ద్విభాషా చిత్రం. అది కాక సూర్య సరసన ‘వానంగాన్’ అనే భారీ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు మలయాళంలో కూడా అవకాశం దక్కించుకుంది.
మలయాళంలో ప్రస్తుతం మంచి ఊపుమీదున్న యువ కథానాయకుడు టొవినో థామస్ సరసన కృతి నటించబోతోంది. అతను హీరోగా ‘అజయంటే రాండం మోషనం’ అనే సినిమా మొదలైంది. జితిన్ లాల్ అనే దర్శకుడు రూపొందిస్తున్న పెద్ద బడ్జెట్ సినిమా ఇది. మిన్నల్ మురళి, తల్లుమాల.. ఇలా వరుసగా బ్లాక్బస్టర్లు కొట్టి మంచి ఊపుమీదున్న టొవినో సరసన కృతి ఛాన్స్ దక్కించుకుందంటే తన అదృష్టమనే చెప్పాలి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది.
This post was last modified on October 12, 2022 9:55 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…