కృతి శెట్టి.. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లోకి ఉప్పెనలా దూసుకొచ్చిన అమ్మాయి కృతి శెట్టి. నిజానిని ఆ సినిమాలో వేరే హీరోయిన్ లీడ్ రోల్ చేయాల్సింది. ప్రారంభోత్సవంలో పాల్గొంది కూడా ఆ అమ్మాయే. కానీ తను ఈ చిత్రానికి సెట్టవ్వదని భావించి, తర్వాత ఆమె తప్పించి కృతిని ఎంచుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.
‘ఉప్పెన’ ఎంత పెద్ద హిట్టయిందో, కృతికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో వరుసగా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ‘ఉప్పెన రిలీజై రెండేళ్లు తిరక్కుండానే ఐదు సినిమాలు రిలీజయ్యాయి కృతివి.
అందులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు బాగానే ఆడాయి కానీ.. ఇటీవల వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది కృతి. రెండు నెలల వ్యవధిలో ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలతో షాక్ల మీద షాక్లు తింది ఈ అమ్మాయి. ఈ చిత్రాల్లో ఆమె అప్పీయరెన్స్, నటన విషయంలో విమర్శలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో కృతి కెరీర్ ఏమవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఐతే తెలుగులో కృతికి కొత్తగా సినిమా అవకాశాలేమీ వస్తున్నట్లు కనిపించడం లేదు కానీ.. ఆమె నెమ్మదిగా వేరే భాషల్లో బిజీ అవుతోంది. ఆల్రెడీ తమిళంలో రెండు సినిమాలు కమిటైంది కృతి. అందులో ఒకటి అక్కినేని నాగచైతన్యతో వెంకట్ ప్రభు రూపొందించబోయే ద్విభాషా చిత్రం. అది కాక సూర్య సరసన ‘వానంగాన్’ అనే భారీ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు మలయాళంలో కూడా అవకాశం దక్కించుకుంది.
మలయాళంలో ప్రస్తుతం మంచి ఊపుమీదున్న యువ కథానాయకుడు టొవినో థామస్ సరసన కృతి నటించబోతోంది. అతను హీరోగా ‘అజయంటే రాండం మోషనం’ అనే సినిమా మొదలైంది. జితిన్ లాల్ అనే దర్శకుడు రూపొందిస్తున్న పెద్ద బడ్జెట్ సినిమా ఇది. మిన్నల్ మురళి, తల్లుమాల.. ఇలా వరుసగా బ్లాక్బస్టర్లు కొట్టి మంచి ఊపుమీదున్న టొవినో సరసన కృతి ఛాన్స్ దక్కించుకుందంటే తన అదృష్టమనే చెప్పాలి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది.
This post was last modified on October 12, 2022 9:55 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…