ఒకవేళ కాలం వెనక్కి తిరిగి మిమ్మల్ని ఏదన్నా కోరుకోమంటే మీకేం కావాలి అని ప్రశ్నించాడు కమెడియన్ ఆలి. ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్ లో పాల్గొన్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఒకప్పటి విజయవాహినీ స్టూడియోస్ తరహా ఎన్విరాన్మెంట్ కావాలంటూ చెప్పారు. అప్పట్లో పొద్దున్నే కార్ రాకపోతే.. మాయాబజార్ వంటి సినిమాలో నటించిన సావిత్రి తన అసిస్టెంట్ సైకిల్ వెనకెక్కి స్టూడియోకు వచ్చేసేవారని, ఇప్పుడు ఆ కమిట్మెంట్ ఏ నటీనటుల్లోనూ కనిపించట్లేదని అల్లూ అరవింద్ వాపోయారు. మరి స్టూడియో సిస్టమ్ ను సినిమాల్లో తిరిగి ప్రవేశ పెట్టడం కుదురుతుందా?
నిజానికి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్.. అలాగే వారికంటే ముందు పెద్ద స్టార్లు అయిపోయిన ఎస్వీరంగారావు వంటి వారు కూడా స్టూడియోల దగ్గర కాంట్రాక్ట్ లో ఉండేవారు. నెల జీతానికి పనిచేసేవారు. అందుకే అలాంటి కమిట్మెంట్ చూపించేవారు. ఇప్పుడంతా రోజువారీ రెమ్యూనరేషన్లకు చిన్న నటులు.. భారీ ఎమౌంట్లకు పెద్ద నటులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడొస్తే అప్పుడే షూటింగ్. వీళ్లు ఎవర్ని పెట్టుకోమంటే వాళ్లకే ఆఫర్లు. అందుకే ఇప్పుడున్న నటీనటులతో అలాంటి స్టూడియో సిస్టమ్స్ అన్నీ కష్టమే. అలాంటి స్టూడియో ఎవరన్నా కట్టినా కూడా ఎవ్వరూ అలా ఒక స్టూడియో దగ్గరే పనిచేయడానికి ఇష్టపడరు కూడాను. స్టూడియో ఓనర్ల పిల్లలే రకరకాలు ప్రొడ్యూసర్ల దగ్గర పనిచేస్తూ కోట్లను పోగేసుకుంటుంటే.. ఇతరులు ఎందుకు అలా జాబ్ చేస్తారు? అంతే కాదు.. ఒకప్పుడంటే కెమెరా చాలా పెద్దది అలాగే బాగా ఖరీదైనది. కాబట్టి ఒక స్టూడియో ఫ్లోర్లోనే సెటప్స్ చేసి అక్కడే కథంతా నడిపించేవారు. ఇప్పుడు పాకెట్లో పట్టే కెమెరాతో 6K క్వాలిటీ వీడియోలు తీసేయొచ్చు. కాబట్టి అందరూ స్టూడియోకే రావాలి అనే అవసరం కూడా పోయింది.
ఇకపోతే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విచిత్రం ఏంటంటే.. యునిట్ సభ్యులందరికీ ఏ కార్పొరేట్ కంపెనీ కూడా పెట్టనట్లు రోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ పెడతారు. ఇది నిజానికి స్టూడియోలు సినిమాలను నిర్మిస్తున్నప్పటి పద్దతి. పొద్దున్నే పాపం నటీనటులు టెక్నీషియన్లు ఇతర వర్కర్లు పాపం వంట చేసుకుని రావాలంటే కష్టం కాబట్టి, ఆ సిస్టం పెట్టారు. కాని ఇప్పుడు 9 గంటలకు సెట్టుకొచ్చి, 5 గంటలకు పేకప్ చెప్పేసే బ్యాచ్ లు కూడా ఇదే సిస్టంను ఫాలో అవుతున్నాయ్. ఆ విధంగా కొన్ని స్టూడియో సిస్టమ్స్ ఇంకా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు.
కాలంతోపాటు కొన్ని మార్పులు వచ్చేస్తాయ్ అనుకుని అల్లు అరవింద్ స్టూడియో సిస్టమ్ గురించి ఆలోచించకపోతేనే మంచిది. ఇక యాక్టర్లు టైముకి రావట్లేదంటే మాత్రం.. డిసిప్లీనరీ యాక్షన్లు గట్టిగా తీసుకుంటే సరిపోతుంది.
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…