అక్కినేని నాగచైతన్యతో వివాహ బంధానికి సమంత తెరదించి అధికారికంగానే ఏడాది దాటిపోయింది. పోయినేడాది ఇదే టైంలో సామ్-చైతూ ఉమ్మడిగా విడాకుల ప్రకటన చేశారు. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నారు. వీరి విడాకుల విషయం బయటికి వచ్చిన కొన్ని నెలలకే చైతూ.. వేరే హీరోయిన్ ఒకరితో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. సమంత గురించి మాత్రం ఇప్పటిదాకా అలాంటి ఊహాగానాలేమీ రాలేదు.
ఐతే ఉన్నట్లుండి ఇప్పుడు సమంత కొత్త తోడు వెతుక్కుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకు ఆమె తాజాగా ట్విట్టర్లో పెట్టిన పోస్టే కారణం. కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత.. ఈ రోజు ఒక ఆసక్తికర పోస్టు పెట్టింది. మీరంతా ఈ విషయం కూడా వినాలనుకుంటుంటే.. మనం ఎప్పటికీ ఒంటరిగా నడవం అన్న క్యాప్షన్తో ఒక ఫొటోను ఆమె షేర్ చేసింది.
టీషర్ట్ మీద యు విల్ నెవర్ వాక్ అలోన్ అనే రాసి ఉంది. తన ముఖం కూడా సరిగా కనిపించని ఈ ఫొటోలో ఆ క్యాప్షన్ ఉన్న టీషర్టే హైలైట్ అయ్యేలా చూసుకుంది సామ్. దీని ద్వారా ఆమె ఒక విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటోందన్నది స్పష్టం. మనం ఎప్పుడూ ఒంటరిగా నడవం అని చెబుతోందంటే.. తనకు తోడుగా ఇంకొకరు నడవబోతున్నారని, లేదా నడుస్తున్నారనే సంకేతాలు ఇస్తున్నట్లే. బహుశా తన వ్యక్తిగత జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చారనే విషయాన్ని సమంత ఇలా చెప్పకనే చెబుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐతే నిజంగా అలాంటి మార్పు ఏమైనా చోటు చేసుకుందా లేక ఇంతమంది అభిమానం చూపిస్తుండగా తాను ఒంటరిని కాదని చెప్పే ప్రయత్నం ఆమె చేసిందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. నిజంగా సమంత జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చి ఉంటే ఆ విషయం బయటపడడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
This post was last modified on October 11, 2022 10:48 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…