Movie News

మెగా ఫ్యామిలీతో గొడవల గురించి

బంధుత్వం కన్నా స్నేహితులుగా ఎక్కువ చనువుగా ఉండే అల్లు అరవింద్, చిరంజీవి బంధం గురించి ఇండస్ట్రీలోనే కాదు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఎప్పటి నుంచో సదభిప్రాయం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా మెగా అల్లు కుటుంబాల మధ్య ఏదో గ్యాప్ వచ్చిందని, అందుకే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. దానికి తగ్గట్టుగానే పబ్లిక్ స్టేజిల మీద పరస్పర ప్రస్తావనలు ఉండటం లేదు. అటు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ దీని గురించే రెండుగా విడిపోయి అవసరం లేని ట్రోలింగ్ లు, గొడవలు చేసుకున్న సందర్భాలున్నాయి. ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది.

ఓ టీవీ ఛానల్ కోసం ఆలీకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ దీనికి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు ఓపెన్ అయ్యారు. తన చెల్లిని ఇచ్చినప్పటి నుంచి తామిద్దరం బావ బావమరుదుల కన్నా ఫ్రెండ్స్ గానే ఉన్నామని, పిల్లలు పెరిగిపెద్దవుతున్న తరుణంలో ఎవరికి వాళ్ళు ఎదగాలనే లక్ష్యంతో వాళ్ళ మధ్య పోటీ ఉందని, అంతే తప్ప ఆ కారణంగా గొడవలు పడేంత సీన్ లేదని కుండ బద్దలు కొట్టేశారు. అంతేకాదు సంక్రాంతి, దీపావళి తదితర పండగలకు రెండు ఫ్యామిలీలు క్రమం తప్పకుండా కలుసుకుంటామని ప్రతిసారి ఆ వీడియోలు పెట్టలేమని తేల్చేశారు.

ఇదే కాదు ఇటీవలే జరిగిన అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు, అల్లు స్టూడియో ఓపెనింగ్ సందర్భంగా చిరంజీవి పంచుకున్న ఎన్నో విషయాలు అందరినీ ఆనందపరచడమే కాదు అల్లు అర్జున్ అయితే ఏకంగా ఎన్నడూ లేని రీతిలో పడి పడి నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. ఈ ప్రస్తావన అలీనే గుర్తు చేశాడు. ఇదే వేడుకలో బన్నీ, రామ్ చరణ్, సాయితేజ్ లు చాలా సన్నిహితంగా మెలుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. మొత్తానికి ఏదో జరుగుతోందనే ప్రచారానికి ఈ రూపంలో చెక్ పెట్టేశారు. ఇలాగే ఆలీ భవిష్యత్తులో చిరంజీవిని కూడా అడిగేస్తే ఓ పనైపోతుందిగా.

This post was last modified on October 11, 2022 8:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: Mega Family

Recent Posts

స్కూటర్ మీద 311 కేసులు.. రూ.1.6లక్షల ఫైన్!

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…

3 minutes ago

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

3 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

3 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీకి డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

14 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago