ఒకప్పుడు తమిళంలో ఏదైనా హిట్ సినిమా రావడం ఆలస్యం దాని రీమేక్ హక్కుల కోసం మన నిర్మాతలు చెన్నై వెళ్ళిపోయి డీల్ సెట్ చేసుకుని వచ్చేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. గత నాలుగైదేళ్లలో మలయాళం కంటెంట్ లో నాణ్యత విపరీతంగా పెరిగిపోయింది. కమర్షియల్ టచ్ ఇస్తూనే క్లాసు మాసు అందరినీ మెప్పించే అద్భుతమైన సబ్జెక్టులతో సదరు దర్శక నిర్మాతలు చేస్తున్న మేజిక్ అంతా ఇంతా కాదు. మెగా బ్రదర్స్ రీసెంట్ హిట్స్ భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ రెండూ అక్కడి నుంచి తెచ్చుకున్న కథలని మర్చిపోకూడదు. బుట్టబొమ్మ లాంటి చిన్న చిత్రం సైతం కేరళలో కొన్న సరుకే.
తాజాగా మమ్ముట్టి నటించిన రోర్సాచ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. నిసం బషీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కు బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. నిజానికి డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కోసం ఓ పేరు మోసిన ఓటిటి మల్లువుడ్ లో అప్పటిదాకా ఎవరూ ఆఫర్ చేయని భారీ మొత్తాన్ని ఇవ్వజూస్తే చిత్ర బృందం నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఇప్పుడు దానికి మించిన గొప్ప ఫలితాన్ని బాక్సాఫీస్ సాక్షిగా ఎంజాయ్ చేస్తోంది. హైదరాబాద్ లోనూ పలు మల్టీప్లెక్సుల్లో మంచి కలెక్షన్లతో ప్రదర్శితమవుతున్న రోర్సాచ్ ని సబ్ టైటిల్స్ సహాయంతో మూవీ లవర్స్ చూస్తున్నారు.
కథ పరంగా ఇదో డిఫరెంట్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివెంజ్ డ్రామా. అటవీ నేపథ్యంలో ఉంటుంది. ఓ ఎన్ఆర్ఐ(మమ్ముట్టి) తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. యాక్సిడెంట్ జరిగాక స్పృహలోకి వచ్చి చూస్తే మాయమయ్యిందని చెబుతాడు. ఆమె దొరికే వరకు ఎక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేస్తాడు. ఆ తర్వాత ఆ గ్రామంలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. అవేంటో తెర మీదే చూడాలి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఊహించని పాయింట్ తో ఈ రోర్సాచ్ ని తీర్చిదిద్దిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరి ఇది ఏ అగ్ర హీరో చేతికి వెళ్తుందో చూడాలి
This post was last modified on October 11, 2022 2:27 pm
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…