అన్నమయ్య సినిమాలో చిన్న మరదలిగా, భారతీయుడు సినిమాలో చెల్లెలి పాత్రలో అలరించిన కస్తూరి తెలుగు ఆడియన్స్ కు సీరియల్స్ ద్వారా సుపరిచితురాలే. కాని రియల్ లైఫ్ లో మాత్రం ఆమె వయస్సు 50కు దగ్గరపడుతున్నా కూడా అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెత్తిస్తుంటుంది. అదంతా పక్కనెడితే, చాలా కాంట్రోవర్షియల్ విషయాల్లో తన ట్విట్టర్ ద్వారా వేలు కాలు పెట్టేసి రచ్చలేపుతుంటుంది కూడాను. నిన్న సడన్ గా సరోగసీ ఇండియాలో అక్రమం, నేనొక లాయర్ గా చెబుతున్నా.. అంటూ పెద్ద హంగామా చేసింది. కాని కథ అంతటితో ఆగలేదు.
నయనతార విఘ్నేష్ శివన్ తమకు కవలలు జన్మించారని చెప్పగానే.. ఎలాగో నయనతార ఎక్కడా ప్రెగ్నెంట్ గా కనిపించలేదు కాబట్టి.. ఖచ్చితంగా వీళ్లు సరోగసి ద్వారానే పిల్లలను కనుంటారని అందరూ అనుకున్నారు. ఈ విషయంపై నయన్ అండ్ విక్కి ఇంకా స్పందించకపోయినా కూడా, చాలామంది దీని గురించి చాలారకాలుగా కామెంట్స్ చేయడం మాత్రం ఆపలేదు. వెంటనే ఈ ట్రెండింగ్ టాపిక్ ను పట్టుకున్న కస్తూరి కూడా.. చాలా తెలివిగా లీగల్ గా ఇరుక్కోకుండా.. అసలు నయన్ పేరు వాడకుండా.. సరోగసి సరైనది కాదంటూ ట్వీటేసింది.
దీనితో నయన్ అభిమానులు ఊరుకుంటారా? వెంటనే ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం మొదలెట్టేశారు. భర్తతో విడాకులు, హాటుగా రెచ్చిపోవడం, వేరే హీరోయిన్ల పర్సనల్ గొడవల్లో తలదూర్చడం వంటి అంశాలపై ఆమెను ఫుట్ బాల్ ఆడేసుకున్నారు. అంతే కాదు, అసలు నయన్ దంపతులు సరోగసీ ద్వారానే ఎందుకు పిల్లల్ని కన్నారో, లేదంటే వారికేమైనా మెడికల్ సమస్యలు ఉన్నాయేమో నీకు తెలీదుకదా, నోరుపాడేసుకోకు అంటూ కొందరు గట్టిగానే మొట్టికాయలు వేశారు. దాంతో కస్తూరి ఏం చేసిందో తెలుసా?
”అసలు నేను నయన్ అండ్ విఘ్నేష్ గురించి మాట్లాడానా? నేను కేవలం సరోగసి గురించి చెప్పానంతే. ఎవరన్నా నా మాటలను నయన్ పిల్లల విషయంతో ముడిపెడితే మాత్రం.. వాళ్ళను కోర్టుకు లాగుతూ. కేసులు పెడతా” అంటూ వెంటనే మరో స్టేట్మెంట్ ఇచ్చింది కస్తూరి.
This post was last modified on October 11, 2022 2:23 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…