గరుడవేగ సినిమాతో తనపై భారీగా అంచనాలు పెంచాడు యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అంతకుముందే అతను ఎల్బీడబ్ల్యూ, చందమామ కథలు, గుంటూరు టాకీస్ లాంటి డీసెంట్ సినిమాలు అందించినా గరుడవేగ చూశాక తన అసలు క్యాలిబర్ ఏంటో తెలిసింది. ఇతడిలో ఇంత కంటెంట్ ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. తన టాలెంట్ గమనించి అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరో అవకాశం ఇచ్చాడు. వీరి కలయికలో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. కానీ సినిమాలో స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప పెద్దగా విషయం లేకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు.
గరుడవేగను ఉత్కంఠభరిత యాక్షణ్ థ్రిల్లర్గా తీర్చిదిద్దిన ప్రవీణ్.. ది ఘోస్ట్లో అదే జానర్ను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కథ, కథనం ఏమాత్రం ఆసక్తి రేకెత్తించలేదు ఈ చిత్రంలో. సినిమా అంతా గన్నుల మోత, యాక్షన్ సీన్ల హంగామా తప్పితే విషయం లేకపోయింది.
ఐతే ది ఘోస్ట్తో అంత పెద్ద దెబ్బ తిన్నాక కూడా ప్రవీణ్ సత్తారు రూట్ మార్చట్లేదు. మళ్లీ యాక్షన్ థ్రిల్లర్ జానర్లోనే సినిమా తీయబోతున్నాడు. వరుణ్తేజ్తో అతడి కొత్త చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా హైలైట్ అయింది గన్నులే. రకరకాల గన్నులు చూపించి వాటిని వరుణ్ తేజ్ టెస్ట్ చేస్తున్నట్లు చూపించారు.
ఇది చూశాక ది ఘోస్ట్ సినిమా అంతటా అన్నేసి గన్నులు, వాటి మోత చూపించి ఫెయిలైన ప్రవీణ్.. తిరిగి తన కొత్త చిత్రంలోనూ ఇవే చూపించబోతున్నాడా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు జనాలు. ఐతే ది ఘోస్ట్ విడుదలకు ముందే ఈ సినిమా కథ లాక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడేం చేసేది లేదు. ఐతే ఘోస్ట్లో ఏం మిస్సయిందో సమీక్షించుకుని ఈసారి జాగ్రత్తగా సినిమా తీస్తాడని వరుణ్ తేజ్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
This post was last modified on October 10, 2022 10:55 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…