గరుడవేగ సినిమాతో తనపై భారీగా అంచనాలు పెంచాడు యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అంతకుముందే అతను ఎల్బీడబ్ల్యూ, చందమామ కథలు, గుంటూరు టాకీస్ లాంటి డీసెంట్ సినిమాలు అందించినా గరుడవేగ చూశాక తన అసలు క్యాలిబర్ ఏంటో తెలిసింది. ఇతడిలో ఇంత కంటెంట్ ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. తన టాలెంట్ గమనించి అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరో అవకాశం ఇచ్చాడు. వీరి కలయికలో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. కానీ సినిమాలో స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప పెద్దగా విషయం లేకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు.
గరుడవేగను ఉత్కంఠభరిత యాక్షణ్ థ్రిల్లర్గా తీర్చిదిద్దిన ప్రవీణ్.. ది ఘోస్ట్లో అదే జానర్ను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కథ, కథనం ఏమాత్రం ఆసక్తి రేకెత్తించలేదు ఈ చిత్రంలో. సినిమా అంతా గన్నుల మోత, యాక్షన్ సీన్ల హంగామా తప్పితే విషయం లేకపోయింది.
ఐతే ది ఘోస్ట్తో అంత పెద్ద దెబ్బ తిన్నాక కూడా ప్రవీణ్ సత్తారు రూట్ మార్చట్లేదు. మళ్లీ యాక్షన్ థ్రిల్లర్ జానర్లోనే సినిమా తీయబోతున్నాడు. వరుణ్తేజ్తో అతడి కొత్త చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా హైలైట్ అయింది గన్నులే. రకరకాల గన్నులు చూపించి వాటిని వరుణ్ తేజ్ టెస్ట్ చేస్తున్నట్లు చూపించారు.
ఇది చూశాక ది ఘోస్ట్ సినిమా అంతటా అన్నేసి గన్నులు, వాటి మోత చూపించి ఫెయిలైన ప్రవీణ్.. తిరిగి తన కొత్త చిత్రంలోనూ ఇవే చూపించబోతున్నాడా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు జనాలు. ఐతే ది ఘోస్ట్ విడుదలకు ముందే ఈ సినిమా కథ లాక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడేం చేసేది లేదు. ఐతే ఘోస్ట్లో ఏం మిస్సయిందో సమీక్షించుకుని ఈసారి జాగ్రత్తగా సినిమా తీస్తాడని వరుణ్ తేజ్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
This post was last modified on October 10, 2022 10:55 pm
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…