గత నెల విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా గురించి బాలీవుడ్ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సినిమాలో విషయం వీకే అయినప్పటికీ పీఆర్ మాయాజాలంతో ఈ సినిమాకు బాగానే హైప్ తీసుకురాగలిగింది కరణ్ జోహార్ టీం. బాలీవుడ్ క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లందరూ ఈ సినిమాను ఆహా ఓహో అంటూ కొనియాడారు. వసూళ్ల గురించి కూడా గొప్పగా చెప్పుకున్నారు. ఇది బ్లాక్బస్టర్ అన్నట్లే కలరింగ్ ఇచ్చారు.
కానీ బాలీవుడ్ సినిమాల వసూళ్లు బాగా పడిపోయిన పరిస్థితుల్లో బ్రహ్మాస్త్ర డివైడ్ టాక్ను తట్టుకుని బాగానే నిలబడింది. ఉన్నంతలో మంచి కలెక్షన్లే రాబట్టింది. చాలా రోజుల పాటు ఆ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగింది. కానీ పెట్టుబడి రాబడి కోణంలో చూస్తే మాత్రం బ్రహ్మాస్త్ర డిజాస్టర్ అనే చెప్పాలి. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన సందర్భంగా బయటికి వచ్చిన నంబర్స్ చూస్తే ఆ విషయాన్ని ఒప్పుకుని తీరాలి.
బ్రహ్మాస్త్ర ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ రూ.400 కోట్ల గ్రాస్, రూ190 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇండియా వరకు ఆ సినిమా గ్రాస్ వసూళ్లు రూ.300 కోట్లకు చేరువగా వచ్చాయి. ఐతే బ్రహ్మాస్త్ర బిజినెస్ రూ.600 కోట్లకు జరిగింది. రూ.300 కోట్ల షేర్ వస్తే తప్ప అది బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి. కానీ రికవరీ చూస్తే 65 శాతం లోపే ఉంది. 35 శాతం.. అంటే రూ.100 కోట్లకు పైగానే నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నమాట ఈ చిత్రం. ఒక్క తెలుగులో మినహాయిస్తే ఎక్కడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నార్త్ మార్కెట్లో బ్రేక్ ఈవెన్కు చాలా దూరంలో ఆగిపోయింది.
కాకపోతే ఈ సినిమాను ఎక్కువ రేట్లకు అమ్మిన కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర-2ను బయ్యర్లకు కాస్త రీజనబుల్ రేట్లకే ఇవ్వొచ్చు. బ్రహ్మాస్త్రకు మంచి హైప్ వచ్చి మీడియాలో, సోషల్ మీడియాలో దాని గురించి బాగానే హడావుడి జరిగింది. దాన్నో బ్లాక్బస్టర్ మూవీలాగా ప్రొజెక్ట్ చేశారు. కాబట్టి సెకండ్పార్ట్కు హైప్ బాగానే వస్తుంది. అలా అందరూ సేఫ్ జోన్లోకి రావడానికి ఛాన్సుంటుంది.
This post was last modified on October 10, 2022 7:50 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…