అనతికాలంలోనే ఏకంగా ఇనస్టాగ్రామ్ లో సమంతకు ఉన్న ఫాలోయింగ్ ను బీట్ చేసేసి.. నేషనల్ క్రష్ గా ఎదిగేసింది రష్మిక మందన్నా. ఒక ప్రక్కన సమంత అండ్ కాజల్ చేసినన్ని సినిమాలు చేయకపోయినా కూడా, రష్మిక రేంజ్ మాత్రం అమాంతం పెరిగింది. కాని ఆ రేంజ్ అక్కడే చాలాకాలాం కొనసాగాలంటే మాత్రం అమ్మడికి హిట్టు సినిమాలతో పాటు అవార్డులూ రివార్డులూ కూడా చాలా ముఖ్యం. అలాంటి ఒక అవార్డ్ ఆమెను వరిస్తుందని అనుకుంటే, చివరకు రష్మిక డిజప్పాయింట్ అవ్వాల్సొచ్చింది.
గతేడాది చివర్లో రిలీజైన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో అల్లు అర్జున్ కు నేషనల్ వైడ్ మార్కెట్ ఓపెన్ అయితే.. రష్మికకు కూడా బాలీవుడ్లో ఆఫర్లు కుప్పలు తెప్పలు వచ్చి పడుతున్నాయ్. అయితే ఆ సినిమాలో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్రకు అమ్మడు ఫిలింఫేర్ బ్లాక్ లేడీ వరిస్తుందని చాలా ఆశించిందట. ఒకవేళ ఆమెకు ఫిలింఫేర్ అవార్డ్ వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా అది కెరియర్ కు చాలానే హెల్ప్ అయ్యేది.
అయితే ఫిలింఫేర్ మాత్రం లవ్ స్టోరి సినిమాలో కనబరచిన అత్యుత్తమ నటనకు సాయిపల్లవిని వరించింది. దాదాపు బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఫిలిం, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సింగర్స్, బెస్ట్ సినిమాటోగ్రాఫీ అవార్డులను దక్కించుకున పుష్ప సినిమాకు, బెస్ట్ హీరోయిన్ ట్రోఫీ మాత్రం దక్కలేదు. ఓ విధంగా చూస్తే ఇది రష్మికకు షాకే.
అసలు తనకు అవార్డు రాలేదనే విషయం ముందుగానే తెలియడంతో అమ్మడు ఏకంగా ఊళ్లో లేకుండా మాల్డీవ్స్ ట్రావెల్ ప్లాన్ చేసుకుందని అంటున్నారు. లేదంటే పుష్ప టీమ్ తో పాటు అమ్మడు కూడా బెంగుళూరు వెళ్ళాల్సి వచ్చేదిగా. మరో ప్రక్కన అమ్మడు బాలీవుడ్లో చేసిన తొలిసినిమా గుడ్ బాయ్ కూడా బాక్సాఫీస్ దగ్గర భారీగా తేలిపోయింది. ఇటు యాక్టింగ్ కు మార్కులు పడలేదు, అటు సినిమాకూ రేటింగులు రాలేదు. అది సంగతి.
This post was last modified on October 10, 2022 12:48 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…